Telugu Global
Others

బాలయ్య పిలుపు కోసం పరుచూరి ఎదురుచూపు

తన వందో చిత్రాన్ని భారీగా నిర్మించాలని నందమూరి బాలకృష్ణ భావిస్తున్నాడు. తొలుత బోయపాటితో అనుకున్నా చివరకు ఆదిత్య 369 సీక్వెల్‌ వైపు బాలయ్య మొగ్గు చూపారు. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంతో ఈ చిత్రం రాబోతోంది. టీ సీఎం కేసీఆర్‌ను కలిసిన సమయంలోనూ బాలకృష్ణ ఇదే విషయాన్ని చెప్పారు. అయితే తాజాగా మరో వార్త కూడా టాలీవుడ్‌లో వినిపిస్తోంది. బాలకృష్ణను డైరెక్ట్ చేసేందుకు ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రవీంద్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక […]

బాలయ్య పిలుపు కోసం పరుచూరి ఎదురుచూపు
X

తన వందో చిత్రాన్ని భారీగా నిర్మించాలని నందమూరి బాలకృష్ణ భావిస్తున్నాడు. తొలుత బోయపాటితో అనుకున్నా చివరకు ఆదిత్య 369 సీక్వెల్‌ వైపు బాలయ్య మొగ్గు చూపారు. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంతో ఈ చిత్రం రాబోతోంది. టీ సీఎం కేసీఆర్‌ను కలిసిన సమయంలోనూ బాలకృష్ణ ఇదే విషయాన్ని చెప్పారు. అయితే తాజాగా మరో వార్త కూడా టాలీవుడ్‌లో వినిపిస్తోంది. బాలకృష్ణను డైరెక్ట్ చేసేందుకు ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రవీంద్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక జానపద కథను బాలకృష్ణకు వినిపించాడట.

భారీ గ్రాఫిక్స్ హంగులతో భారీ రేంజ్‌లో ఈ సినిమా తీయాలని పరుచూరి తనయుడు ఉవ్విల్లూరుతున్నాడు. అన్ని కలిసొస్తే బాలయ్య వందో సినిమానే తన తొలి దర్శకత్వ చిత్రంగా మార్చుకోవాలని పరుచూరి రవీంద్ర భావిస్తున్నారు. కథ వినిపించిన రవీంద్ర బాలయ్య నుంచి సిగ్నల్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ప్రతిష్టాత్మక వందో సినిమాను కొత్త దర్శకుడికి అప్పగించేందుకు బాలకృష్ణ ఎంతవరకు అంగీకరిస్తారో చూడాలి. ఏది ఏమైనా బాలయ్యకు డిమాండ్ బాగానే పెరిగినట్టు కనిపిస్తోంది.

First Published:  19 Jan 2016 1:10 AM GMT
Next Story