Telugu Global
Cinema & Entertainment

మొన్న మహేష్.... నిన్న బాలయ్య... రేపు రామ్ చరణ్

ఇలా ఎవర్నీ వదలట్లేదు యంగ్ టైగర్. సమరానికి సై అంటున్నారు. బాక్సాఫీస్ యుద్ధానకి కాలుదువ్వుతున్నాడు. తన దృష్టిలో పోటీకి ఎవరైనా ఒకటే అంటూ సవాల్ విసురుతున్నాడు. సాధారణంగా ఏ రెండు బడా సినిమాలు ఒకేసారి విడుదలకావు. కనీసం వారం గ్యాప్ అయినా ఇస్తారు. కానీ ఆ సంప్రదాయాన్ని తారక్ తొక్కిపడేశాడు. బాలయ్య నటించిన డిక్టేటర్ కు పోటీగా నాన్నకు ప్రేమతో విడుదల చేశాడు. గతంతో మహేష్, పవన్ కు పోటీగా కూడా చిత్రాలు విడుదల చేశాడు. తాజాగా […]

మొన్న మహేష్.... నిన్న బాలయ్య... రేపు రామ్ చరణ్
X
ఇలా ఎవర్నీ వదలట్లేదు యంగ్ టైగర్. సమరానికి సై అంటున్నారు. బాక్సాఫీస్ యుద్ధానకి కాలుదువ్వుతున్నాడు. తన దృష్టిలో పోటీకి ఎవరైనా ఒకటే అంటూ సవాల్ విసురుతున్నాడు. సాధారణంగా ఏ రెండు బడా సినిమాలు ఒకేసారి విడుదలకావు. కనీసం వారం గ్యాప్ అయినా ఇస్తారు. కానీ ఆ సంప్రదాయాన్ని తారక్ తొక్కిపడేశాడు. బాలయ్య నటించిన డిక్టేటర్ కు పోటీగా నాన్నకు ప్రేమతో విడుదల చేశాడు. గతంతో మహేష్, పవన్ కు పోటీగా కూడా చిత్రాలు విడుదల చేశాడు. తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ ను టార్గెట్ చేశాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజీ అనే సినిమా చేస్తున్నాడు. లాంగ్ వీకెండ్ ను దృష్టిలో పెట్టుకొని, ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయాలని భావిస్తున్నారు. భావించడం కాదు డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. అయితే అదే డేట్ పై మెగా హీరో రామ్ చరణ్ కూడా కన్నేశాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్న తని ఒరువన్ రీమేక్ ను ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేయాలనుకుంటున్నాడు. కానీ తారక్ మాత్రం తగ్గేది లేదంటున్నాడు. తను ఫిక్స్ చేసుకున్న డేట్ కు ఎవరు పోటీ వచ్చినా… తన సినిమా మాత్రం తప్పుకునే ప్రసక్తి లేదని ఇండైరెక్ట్ గా సంకేతాలిచ్చాడు. దీంతో మొన్న బాలయ్యతో తలపడిన ఎన్టీఆర్… ఈసారి చరణ్ తో యుద్ధం చేస్తాడని అంతా ఫిక్స్ అయిపోయారు.
First Published:  24 Jan 2016 7:02 PM GMT
Next Story