Telugu Global
Cinema & Entertainment

అజిత్ వేదాల‌మా... లేక ఖుషి సీక్వెలా..!

ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్ బిజీలో వున్న విష‌యం తెలిసిందే.  అయితే ఈ మ‌ధ్య  స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సెట్ లోకి చిరు  స‌డ‌న్ విజిట్ చేసి ప‌వ‌న్ తోపాటు.. చిత్ర యూనిట్ స‌భ్యుల్ని  ఆశ్చ‌ర్య ప‌రిచిన విష‌యం తెలిసిందే. క‌ట్   చేస్తే చిరంజీవి తోపాటు..  త‌మిళ ద‌ర్శ‌కుడు ఎస్ జె సూర్య కూడా వెళ్లారు.   ఎస్ జె సూర్య  గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో  ఖుషి చిత్రం చేసి వుండ‌టంతో..  […]

అజిత్ వేదాల‌మా... లేక ఖుషి సీక్వెలా..!
X

ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ సీక్వెల్ బిజీలో వున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మ‌ధ్య స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సెట్ లోకి చిరు స‌డ‌న్ విజిట్ చేసి ప‌వ‌న్ తోపాటు.. చిత్ర యూనిట్ స‌భ్యుల్ని ఆశ్చ‌ర్య ప‌రిచిన విష‌యం తెలిసిందే. క‌ట్ చేస్తే చిరంజీవి తోపాటు.. త‌మిళ ద‌ర్శ‌కుడు ఎస్ జె సూర్య కూడా వెళ్లారు. ఎస్ జె సూర్య గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఖుషి చిత్రం చేసి వుండ‌టంతో.. ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచ‌న‌తోనే అక్క‌డ‌కు వెళ్లార‌నే టాక్ బాగా వినిపించింది. అయితే కోలీవుడ్ మీడియా లో మ‌రో వార్త కూడా ప్ర‌చారంలో ఉంది. త‌మిళ్ లో అజిత్ హీరోగా చేసిన వేదాల‌మ్ సినిమా ను ..తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా రీమేక్ చేసే ఆలోచ‌నతోనే ద‌ర్శ‌కుడు సూర్య ప‌వ‌న్ ను క‌ల‌సిన‌ట్లు చెబుతున్నారు. మ‌రి ఈ రెండిటిలో ఏది అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల‌సిందే..!

First Published:  31 Jan 2016 7:05 PM GMT
Next Story