Telugu Global
NEWS

నా "కంపెనీ" నాశనమైంది

కేరళను కుదిపేస్తున్న సోలార్ కుంభకోణంలో నిందితురాలుగా ఉన్న సరితా నాయర్ మరోసారి ముఖ్యమంత్రి ఉమన్ చాందీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కుమారుడికి ఒక మహిళతో అక్రమసంబంధం ఉందని ఆరోపించిన సరితా.. తాజాగా కొత్త విషయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రికి ఒక కోటి 90 లక్షల రూపాయలు లంచంగా ఇచ్చానని చెప్పారామె. అది కూడా సీఎం సహాయ నిధికి కాదని నేరుగా లంచంగానే ఇచ్చానన్నారు. తన కంపెనీ ఎదుగుదలతో పాటు పతనానికి కూడా ముఖ్యమంత్రే కారణమని ఆరోపించారు. […]

నా కంపెనీ నాశనమైంది
X

కేరళను కుదిపేస్తున్న సోలార్ కుంభకోణంలో నిందితురాలుగా ఉన్న సరితా నాయర్ మరోసారి ముఖ్యమంత్రి ఉమన్ చాందీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కుమారుడికి ఒక మహిళతో అక్రమసంబంధం ఉందని ఆరోపించిన సరితా.. తాజాగా కొత్త విషయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రికి ఒక కోటి 90 లక్షల రూపాయలు లంచంగా ఇచ్చానని చెప్పారామె. అది కూడా సీఎం సహాయ నిధికి కాదని నేరుగా లంచంగానే ఇచ్చానన్నారు. తన కంపెనీ ఎదుగుదలతో పాటు పతనానికి కూడా ముఖ్యమంత్రే కారణమని ఆరోపించారు. సోలార్ స్కాంలో 2013లో అరెస్టయిన సరిత.. బెయిల్ మీద విడుదలైనప్పటి నుంచి సీఎం మీద ఆరోపణలు గుప్పిస్తోంది.

కొద్ది రోజుల క్రితం విచారణ కమిటీ ముందు హాజరైన సరిత … సీఎం కుమారుడికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. సదరు మహిళ కూడా ఈ కేసులో నిందితురాలేనని చెప్పారు. జూనియర్ చాందీ, సదరు మహిళ సన్నిహితంగా ఉన్న ఫోటోలు, ఇతర ఆధారాలు మంత్రి రాధాకృష్ణన్ వద్ద ఉన్నాయని సరిత వెల్లడించారు. మంత్రి దగ్గర ఉన్న ఆధారాలను ముఖ్యమంత్రిని బ్లాక్‌మెయిల్ చేసేందుకు వాడుకుంటున్నారని చెప్పారు. సీఎం కుమారుడితో తనకు అక్రమ సంబంధం ఉందన్న ఆరో్పణలను ఆమె కొట్టిపారేశారు.

First Published:  3 Feb 2016 4:17 AM GMT
Next Story