Telugu Global
CRIME

ప‌క్కింట్లోనే పొంచి ఉన్న మృత్యువు!

ఆడ‌పిల్ల‌ల‌కు స‌న్నిహితులు, బంధువులు, ఇళ్ల చుట్టుప‌క్క‌ల నివ‌సిన్తున్న‌వారినుండే ఆప‌ద ఎక్కువ‌గా ఉంద‌ని ఇప్ప‌టికే నేర గ‌ణాంకాల విశ్లేష‌ణ‌లు చెబుతున్నాయి. అందుకు రుజువుగా ప‌లు ఘోరాలు వెలుగుచూస్తున్నాయి. పంజాబ్‌, లూథియానాలో జ‌రిగిన ఈ దారుణం కూడా అలాంటిదే. షేర్‌పూర్ ప్రాంతంలో నివ‌సిస్తున్న ఆ అమ్మాయికి అత‌ను ప‌క్కింటి వ్య‌క్తి. రోజూ చూస్తున్న‌వాడే. కానీ అత‌నినుండే త‌న‌కు ప్ర‌మాదం ఉంటుంద‌ని ఆమె ఎన్న‌డూ ఊహించి ఉండ‌దు. సునీల్ అనే ఆ వ్య‌క్తి ఆ బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆమె త‌న […]

ప‌క్కింట్లోనే పొంచి ఉన్న మృత్యువు!
X

ఆడ‌పిల్ల‌ల‌కు స‌న్నిహితులు, బంధువులు, ఇళ్ల చుట్టుప‌క్క‌ల నివ‌సిన్తున్న‌వారినుండే ఆప‌ద ఎక్కువ‌గా ఉంద‌ని ఇప్ప‌టికే నేర గ‌ణాంకాల విశ్లేష‌ణ‌లు చెబుతున్నాయి. అందుకు రుజువుగా ప‌లు ఘోరాలు వెలుగుచూస్తున్నాయి. పంజాబ్‌, లూథియానాలో జ‌రిగిన ఈ దారుణం కూడా అలాంటిదే. షేర్‌పూర్ ప్రాంతంలో నివ‌సిస్తున్న ఆ అమ్మాయికి అత‌ను ప‌క్కింటి వ్య‌క్తి. రోజూ చూస్తున్న‌వాడే. కానీ అత‌నినుండే త‌న‌కు ప్ర‌మాదం ఉంటుంద‌ని ఆమె ఎన్న‌డూ ఊహించి ఉండ‌దు. సునీల్ అనే ఆ వ్య‌క్తి ఆ బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆమె త‌న త‌ల్లిదండ్రుల‌కు చెబుతాన‌ని అన‌డంతో, ఆ అమాయ‌కురాలిపై కిరోసిన్ పోసి త‌గుల‌బెట్టాడు. ఆసుప్ర‌తికి తీసుకువెళ్లినా ఫ‌లితం లేక‌పోయింది. తొంభై శాతం శ‌రీరం కాలిపోవ‌డంతో ఆమె మ‌ర‌ణించింది. బాలిక తండ్రి కూలీప‌ని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ కేసులో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో సునీల్ ప్ర‌ధాన నిందితుడని పోలీసులు వెల్ల‌డించారు.

First Published:  27 Feb 2016 6:40 AM GMT
Next Story