ముందు స్నేహం...తరువాత సామూహిక అత్యాచారం!
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో దారుణం చోటుచేసుకుంది. అక్కడ పోలీస్ శాఖ నిర్వహించిన ప్రత్యేక ఉచిత శిక్షణా శిబిరానికి హాజరైన గొట్టి శ్రీనివాస్కి ఒక యువతితో స్నేహం కుదిరింది. స్నేహం పేరుతో చనువు పెంచుకున్న శ్రీనివాస్, అతని మరో ఇద్దరు స్నేహితులు కలిసి ఆమెపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీనివాస్ నమ్మించి ఈ దారుణానికి పాల్పడటమే కాకుండా ఆ దృశ్యాలను సెల్ఫోనులో చిత్రీకరించాడు. ఎవరికైనా చెబితే వాటిని బయటపెడతామని బెదిరించారు. పైగా పదేపదే ఫోనులు చేసి […]
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో దారుణం చోటుచేసుకుంది. అక్కడ పోలీస్ శాఖ నిర్వహించిన ప్రత్యేక ఉచిత శిక్షణా శిబిరానికి హాజరైన గొట్టి శ్రీనివాస్కి ఒక యువతితో స్నేహం కుదిరింది. స్నేహం పేరుతో చనువు పెంచుకున్న శ్రీనివాస్, అతని మరో ఇద్దరు స్నేహితులు కలిసి ఆమెపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీనివాస్ నమ్మించి ఈ దారుణానికి పాల్పడటమే కాకుండా ఆ దృశ్యాలను సెల్ఫోనులో చిత్రీకరించాడు. ఎవరికైనా చెబితే వాటిని బయటపెడతామని బెదిరించారు. పైగా పదేపదే ఫోనులు చేసి తిరిగి తమ కోరిక తీర్చాల్సిందిగా వేధించసాగారు. దీంతో విసిగి పోయిన ఆ యువతి తన గ్రామస్తులకు విషయం చెప్పింది. గ్రామస్తులు ఆ ముగ్గురిని పట్టుకుని చితకబాది వారివద్దనుండి సెల్ఫోన్లు లాక్కుని పోలీసులకు అప్పగించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం కలిగించింది.