Telugu Global
CRIME

మ‌ద్య‌పానం... య‌మ‌పాశ‌మైంది!

తాగిన మైకంలో ఓ వ్య‌క్తి కాప్రా చెరువు లోకి దూకేశాడు. పోలీసులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం 35ఏళ్ల సిద్దులు, శుక్ర‌వారం సాయంత్రం భార్య‌తో పోట్లాడి, బాగా తాగేసి, ఆ మైకంలోనే కాప్రా చెరువులోకి దూకేశాడు. పోలీసులు అత‌ని మృత‌దేహంకోసం ఈత‌గాళ్ల‌చేత వెతికిస్తున్నారు. సిద్ధులు అత‌ని భార్య క‌విత కూడా సైనిక‌పురిలో ఒక ఆర్మీ ఆఫీస‌ర్ ఇంట్లో ప‌నిచేస్తున్నారు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు. ప‌నిచేస్తున్న చోటే ఓ గ‌దిలో ఈ కుటుంబం నివ‌సిస్తోంది.  సిద్ధులు భార్య‌ని తాగ‌డానికి డ‌బ్బు […]

మ‌ద్య‌పానం... య‌మ‌పాశ‌మైంది!
X

తాగిన మైకంలో ఓ వ్య‌క్తి కాప్రా చెరువు లోకి దూకేశాడు. పోలీసులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం 35ఏళ్ల సిద్దులు, శుక్ర‌వారం సాయంత్రం భార్య‌తో పోట్లాడి, బాగా తాగేసి, ఆ మైకంలోనే కాప్రా చెరువులోకి దూకేశాడు. పోలీసులు అత‌ని మృత‌దేహంకోసం ఈత‌గాళ్ల‌చేత వెతికిస్తున్నారు. సిద్ధులు అత‌ని భార్య క‌విత కూడా సైనిక‌పురిలో ఒక ఆర్మీ ఆఫీస‌ర్ ఇంట్లో ప‌నిచేస్తున్నారు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు. ప‌నిచేస్తున్న చోటే ఓ గ‌దిలో ఈ కుటుంబం నివ‌సిస్తోంది.

సిద్ధులు భార్య‌ని తాగ‌డానికి డ‌బ్బు అడుగుతూ, త‌ర‌చుగా గొడ‌వ‌పెట్టుకునేవాడు. శుక్ర‌వారం కూడా అలాగే గొడ‌వ చేసి భార్య‌వ‌ద్ద 500రూ. తీసుకుని బాగా తాగేశాడు. త‌రువాత కాప్రా చెరువు వ‌ద్ద‌కు వెళ్లి అందులో ప‌డిపోయాడు. అత‌ను మంచి ఈతగాడు అయినా ఆల్క‌హాల్ మ‌త్తు కార‌ణంగా ఈద‌లేక‌పోయాడని పోలీసులు వెల్ల‌డించారు. అత‌ను మునిగిపోవ‌డం చూసిన ఆ దారిన వెళ్లేవాళ్లు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఇది జ‌రిగి 24 గంట‌లు కావ‌స్తున్నా సిద్ధులు మృత‌దేహం ల‌భించ‌లేద‌ని, గ‌జ ఈత‌గాళ్ల‌ని పిలిపించి ప్ర‌య‌త్రిస్తున్నామని శ‌నివారం సాయంత్రం పోలీసులు వెల్ల‌డించారు.

First Published:  28 Feb 2016 1:36 AM GMT
Next Story