టిప్పు పంచుకోవడంలో గొడవ...ప్రాణాలు తీసింది!
హోటల్లో పనిచేస్తున్న ఇద్దరు వెయిటర్స్ మధ్య టిప్పు పంచుకోవడంలో తలెత్తిన గొడవ హత్యకు దారితీసింది. బెంగలూరులో ఈ ఘటన జరిగింది. కర్ణాటకలోని నీలమంగళకు చెందిన నాగరాజు (45), గంగావతికి చెందిన వీరేష్ మూడునెలలుగా ఓ హోటల్లో పనిచేస్తున్నారు. వారిద్దరికీ మధ్య టిప్పు ద్వారా లభించే డబ్బుని పంచుకోవడంలో గొడవ జరిగింది. దాంతో వీరేష్, అర్థరాత్రి నిద్రపోతున్న నాగరాజు తలపై గ్రైండర్ రాయితో మోది చంపి పారిపోయాడు. ఉదయం ఏడుగంటలకు హోటల్ యజమాని హాటల్ని తెరవడానికి రాగా హతుడు […]
హోటల్లో పనిచేస్తున్న ఇద్దరు వెయిటర్స్ మధ్య టిప్పు పంచుకోవడంలో తలెత్తిన గొడవ హత్యకు దారితీసింది. బెంగలూరులో ఈ ఘటన జరిగింది. కర్ణాటకలోని నీలమంగళకు చెందిన నాగరాజు (45), గంగావతికి చెందిన వీరేష్ మూడునెలలుగా ఓ హోటల్లో పనిచేస్తున్నారు. వారిద్దరికీ మధ్య టిప్పు ద్వారా లభించే డబ్బుని పంచుకోవడంలో గొడవ జరిగింది. దాంతో వీరేష్, అర్థరాత్రి నిద్రపోతున్న నాగరాజు తలపై గ్రైండర్ రాయితో మోది చంపి పారిపోయాడు. ఉదయం ఏడుగంటలకు హోటల్ యజమాని హాటల్ని తెరవడానికి రాగా హతుడు రక్తపుమడుగులో కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి వీరేష్ కోసం గాలిస్తున్నారు.