రాజీవ్ గాంధీ హంతకురాలికి ఒక రోజు పెరోల్!
రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నళినికి మద్రాస్ హైకోర్టు ఒకరోజు పెరోల్ని మంజూరు చేసింది. మంగళవారం సాయంత్రం నాలుగు నుండి బుధవారం సాయంత్రం నాలుగు వరకు ఈ పెరోల్ సెలవు వర్తిస్తుంది. గతనెలలో మరణించిన తండ్రి 16వ రోజు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆమెకు కోర్టు ఈ పెరోల్ మంజూరు చేసింది. నళిని పోలీస్ ఎస్కార్ట్తోనే వెళ్లి తిరిగి బుధవారం జైలుకి చేరాలని జస్టిస్ ఆర్ మాలా తెలిపారు. ఫిబ్రవరి 24వతేదీన తండ్రి అంత్యక్రియలకు కూడా […]
రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నళినికి మద్రాస్ హైకోర్టు ఒకరోజు పెరోల్ని మంజూరు చేసింది. మంగళవారం సాయంత్రం నాలుగు నుండి బుధవారం సాయంత్రం నాలుగు వరకు ఈ పెరోల్ సెలవు వర్తిస్తుంది. గతనెలలో మరణించిన తండ్రి 16వ రోజు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆమెకు కోర్టు ఈ పెరోల్ మంజూరు చేసింది. నళిని పోలీస్ ఎస్కార్ట్తోనే వెళ్లి తిరిగి బుధవారం జైలుకి చేరాలని జస్టిస్ ఆర్ మాలా తెలిపారు. ఫిబ్రవరి 24వతేదీన తండ్రి అంత్యక్రియలకు కూడా నళినికి 12 గంటల పెరోల్ సెలవు లభించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో ట్రయల్ కోర్టు నళినికి మరణశిక్ష విధించగా, తమిళనాడు గవర్నర్ దాన్ని జీవితకాల శిక్షగా మార్చారు.