Telugu Global
NEWS

టీడీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేల షాక్

తెలంగాణ టీడీపీ ఖాళీ అవుతోంది. మిగిలిన కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడుతున్నారు. తాజాగా  జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాంగటి గోపినాథ్, ఆరికెపూడి గాంధీలు టీడీపీ వీడేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజులుగా వారు పార్టీకి అందుబాటులో లేరు. టీడీఎల్పీ సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. సోమవారం జరిగిన మాధవరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు.  వీరు రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్‌లో చేరుతానని సమాచారం.  చంద్రబాబు సమాజికవర్గానికే చెందిన గోపినాథ్‌ను ఇటీవల గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడిగా చేశారు. కానీ […]

టీడీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేల షాక్
X

తెలంగాణ టీడీపీ ఖాళీ అవుతోంది. మిగిలిన కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడుతున్నారు. తాజాగా జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాంగటి గోపినాథ్, ఆరికెపూడి గాంధీలు టీడీపీ వీడేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజులుగా వారు పార్టీకి అందుబాటులో లేరు. టీడీఎల్పీ సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. సోమవారం జరిగిన మాధవరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు. వీరు రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్‌లో చేరుతానని సమాచారం. చంద్రబాబు సమాజికవర్గానికే చెందిన గోపినాథ్‌ను ఇటీవల గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడిగా చేశారు. కానీ ఆయన కూడాపార్టీ వీడేందుకు సిద్ధమవడంతో చర్చనీయాంశమైంది. ఇక టీడీపీకి మిగిలింది రేవంత్, సండ్ర, ఆర్ కృష్ణయ్య మాత్రమే. అయితే ఆర్ కృష్ణయ్య చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన బీసీల సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. చివరకు రేవంత్, సండ్ర మాత్రమే మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి.

Click on image to read:

bhumana

balakrishna1

adinarayana-reddy

sharapova1

mla-anitha

ravela-son

jagan-assembly

bali

roja

First Published:  8 March 2016 4:56 AM GMT
Next Story