Telugu Global
NEWS

అప్పుడే నీరు ఒంటబట్టాయి…సాక్షి ప్రతినిధిపై దాడి

తెలుగుదేశం ఎమ్మెల్యేలకు వారి పుత్రరత్నాలతో కష్టాలు వచ్చిపడుతున్నాయి. రావెల కిషోర్‌ కుమారుడు రావెల సుశీలు ఘటన మరవకముందే మరో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కుమారుడు తన అనుచరులతో తాడేపల్లి పట్టణ సాక్షి విలేకరి టి. నాగిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కుమారుడు, అతని అనుచరులతో కలిసి ఒక వ్యక్తిని బలవంతంగా  కారులో తీసుకెళ్తున్నారన్న  సమాచారంతో విలేకరి నాగిరెడ్డి ఉండవల్లి సెంటర్‌లో అప్రమత్తంగా వున్నారు. అంతలోనే ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారు రావడంతో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన ఎమ్మెల్యే కుమారుడు, […]

అప్పుడే నీరు ఒంటబట్టాయి…సాక్షి ప్రతినిధిపై దాడి
X

తెలుగుదేశం ఎమ్మెల్యేలకు వారి పుత్రరత్నాలతో కష్టాలు వచ్చిపడుతున్నాయి. రావెల కిషోర్‌ కుమారుడు రావెల సుశీలు ఘటన మరవకముందే మరో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కుమారుడు తన అనుచరులతో తాడేపల్లి పట్టణ సాక్షి విలేకరి టి. నాగిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కుమారుడు, అతని అనుచరులతో కలిసి ఒక వ్యక్తిని బలవంతంగా కారులో తీసుకెళ్తున్నారన్న సమాచారంతో విలేకరి నాగిరెడ్డి ఉండవల్లి సెంటర్‌లో అప్రమత్తంగా వున్నారు. అంతలోనే ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారు రావడంతో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు.

అది గమనించిన ఎమ్మెల్యే కుమారుడు, అతని అనుచరులు ఒక్కసారిగా అతని పై దాడి చేసి, కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు మరి కొంత మంది వచ్చి విలేకరిని తీవ్రంగా దుర్భాషలాడి దౌర్జన్యానికి దిగారు. దీంతో ఆ విలేకరి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే కుమారుడు, అతని అనుచరులపై ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వీరేంద్రబాబు ఎమ్మెల్యే కుమారునితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మిగతావారు పరారీలో ఉన్నారు. కొద్ది రోజుల కిందనే వైసీపీని వీడి జలీల్‌ఖాన్‌ టీడీపీలో చేరారు. ఈ కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యే తెలుగుదేశం నీళ్లను ఒంటపట్టించుకున్నారని అక్కడి ప్రజలు గుసగుసలాడుకుంటున్నారని సమాచారం.

Click on image to read:

bhumana

sharapova1

tdp-mlas

balakrishna1

adinarayana-reddy

ravela-son

mla-anitha

jagan-assembly

bali

jagan

roja1

roja

First Published:  8 March 2016 11:49 AM GMT
Next Story