సిసిటివి ఫుటేజి హంతకున్ని పట్టించింది!
ఒక మహిళపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు సిసిటివి ఫుటేజి ఆధారంగా నేరస్తుడిని పట్టుకున్నారు. గత ఆదివారం హైదరాబాద్, తుర్కపల్లి ప్రాంతంలో మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని పాతికేళ్ల మహిళ హత్యకు గురయింది. ఆమెపై అత్యాచారం చేసి రాయితో తలపై మోది హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇతర ఆధారాలు ఏమీ దొరకకపోవడంతో పోలీసులు ఆ దగ్గరలో ట్రాపిక్ కూడలి వద్ద అమర్చిన సిసిటివి తాలూకూ ఫుటేజిని పరిశీలించారు. నేరం జరిగిన ప్రాంతానికి చేరువలో […]
ఒక మహిళపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు సిసిటివి ఫుటేజి ఆధారంగా నేరస్తుడిని పట్టుకున్నారు. గత ఆదివారం హైదరాబాద్, తుర్కపల్లి ప్రాంతంలో మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని పాతికేళ్ల మహిళ హత్యకు గురయింది. ఆమెపై అత్యాచారం చేసి రాయితో తలపై మోది హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇతర ఆధారాలు ఏమీ దొరకకపోవడంతో పోలీసులు ఆ దగ్గరలో ట్రాపిక్ కూడలి వద్ద అమర్చిన సిసిటివి తాలూకూ ఫుటేజిని పరిశీలించారు. నేరం జరిగిన ప్రాంతానికి చేరువలో ఉన్న ఒక సన్నని సందుగుండా ఒక వ్యక్తి ఆదివారం అర్థరాత్రి 12 గంటలకు అవతలి వైపుకి వెళ్లడం, తిరిగి ఒంటిగంటకు అదే దారిలో బయటకు రావడం పోలీసులు గమనించారు. ఆ ఫుటేజిని స్థానికులకు చూపడంతో వారు ఆ వ్యక్తిని 19ఏళ్ల ప్రవీణ్గా గుర్తించారు. పోలీసుల ఇంటరాగేషన్లో ప్రవీణ్ ఆ హత్య తానే చేసినట్టుగా ఒప్పుకున్నాడు.
పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఆ మహిళ గత రెండునెలలుగా అదే ప్రాంతంలో తిరుగుతోంది. ప్రవీణ్ వైన్షాపుకి సమీపంలో ఒక తినుబండారాల షాపుని నడుపుతున్నాడు. ఆ మహిళ తరచుగా అతని షాపుకి వచ్చి కొనుక్కునేది. అలా ఆమె ప్రవీణ్ దృష్టిలో పడింది. హత్యచేసిన రోజుకి ముందు కూడా ప్రవీణ్ ఆమెపై రెండుసార్లు అత్యాచారం చేశాడు. అయితే ఆ రోజు మాత్రం అతనికి, ఆమె తన విషయం ఎవరికైనా చెబుతుందేమో అనే భయం కలిగింది. దాంతో అత్యాచారం అనంతరం తలపై రాయితో మోది చంపేశాడు. పోలీసులు ప్రవీణ్ని అరెస్టు చేశారు. కమ్యునిటీ సిసిటివి ప్రాజెక్టులో భాగంగా నెలక్రితమే అమర్చిన ఆ సిసిటివి హంతకుని పట్టించింది.