Telugu Global
NEWS

చదువుకోసం స్కూల్‌కు వస్తే ఆసుపత్రిపాలు

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో తొమ్మిదినెలల క్రితం కట్టిన ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలలో శుక్రవారంనాడు క్లాసులు జరుగుతుండగా స్లాబ్‌ పెచ్చులువూడి పడి కొందరి విద్యార్ధులకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే యం.జె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఈ స్కూలు భవనాన్ని కట్టి తొమ్మిదినెలలే అయింది. కాంట్రాక్టర్‌ నాసిరకంగా కట్టడంవల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులంటున్నారు. తొమ్మిదినెలలకే ఇలాంటి పరిస్థితి ఏర్పడిన స్కూల్‌లో తమ పిల్లలను చదివించడానికి విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

చదువుకోసం స్కూల్‌కు వస్తే ఆసుపత్రిపాలు
X

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో తొమ్మిదినెలల క్రితం కట్టిన ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలలో శుక్రవారంనాడు క్లాసులు జరుగుతుండగా స్లాబ్‌ పెచ్చులువూడి పడి కొందరి విద్యార్ధులకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే యం.జె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఈ స్కూలు భవనాన్ని కట్టి తొమ్మిదినెలలే అయింది. కాంట్రాక్టర్‌ నాసిరకంగా కట్టడంవల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులంటున్నారు. తొమ్మిదినెలలకే ఇలాంటి పరిస్థితి ఏర్పడిన స్కూల్‌లో తమ పిల్లలను చదివించడానికి విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

First Published:  11 March 2016 10:05 PM GMT
Next Story