Telugu Global
Cinema & Entertainment

బాలయ్య కోసం 'కంచె' డబ్బులు పెడుతున్న క్రిష్

బాలయ్య వందో సినిమా దాదాపు కన్ ఫర్మ్ అయింది. క్రిష్ లేదా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని బాలయ్య ఇప్పటికే ప్రకటించాడు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ ఇస్తానని కూడా స్పష్టంచేశాడు. అయితే బాలయ్య క్లారిటీ ఇవ్వకముందే ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. నటసింహానికి పౌరాణిక పాత్రలన్నా… హిస్టారికల్ సినిమాలన్నా చాలా ఇష్టం. కాబట్టి… కృష్ణవంశీ రైతు కథ కంటే క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథకే బాలయ్య ఓటేస్తారని అంతా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయ్యారు. […]

బాలయ్య కోసం కంచె డబ్బులు పెడుతున్న క్రిష్
X
బాలయ్య వందో సినిమా దాదాపు కన్ ఫర్మ్ అయింది. క్రిష్ లేదా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని బాలయ్య ఇప్పటికే ప్రకటించాడు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ ఇస్తానని కూడా స్పష్టంచేశాడు. అయితే బాలయ్య క్లారిటీ ఇవ్వకముందే ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. నటసింహానికి పౌరాణిక పాత్రలన్నా… హిస్టారికల్ సినిమాలన్నా చాలా ఇష్టం. కాబట్టి… కృష్ణవంశీ రైతు కథ కంటే క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథకే బాలయ్య ఓటేస్తారని అంతా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయ్యారు. ఈ అంచనాలకు తగ్గట్టే… క్రిష్ కూడా ఒక్కో విషయాన్ని బయటపెడుతున్నారు. బాలయ్య సినిమాకు యోధుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు క్రిష్ చెబుతున్నాడు. అంతేకాదు… తనే నిర్మాతగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై బాలయ్య వందో సినిమాను నిర్మిస్తానని చెబుతున్నాడు. కంచె సినిమాకు వచ్చిన డబ్బుల్ని బాలయ్య కోసం ఖర్చుపెడుతున్నాడమన్నమాట. ఈ సినిమాకు క్రిష్ తో పాటు…. వారాహి చలనచిత్ర బ్యానర్ కు చెందిన సాయి కొర్రపాటి కూడా సహనిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.
First Published:  13 March 2016 4:57 AM GMT
Next Story