ఇంట్లో దింపుతామని...అత్యాచారం చేశారు!
ఒక వివాహిత మహిళ, మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన కర్ణాటక, బెల్గాంలో జరిగింది. పరస్పరం బంధువులైన ఆ మహిళ, బాలిక ఆసుపత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు వారిని యార్గట్టి కి సమీపంలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో బన్నూర్ అనే వ్యక్తి మహిళకు, బాలికకు బంధువు అని తెలుస్తోంది. అతనే ఈ ఘటనలో ప్రధాన నిందితుడని పోలీసులు వెల్లడించారు. […]
ఒక వివాహిత మహిళ, మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన కర్ణాటక, బెల్గాంలో జరిగింది. పరస్పరం బంధువులైన ఆ మహిళ, బాలిక ఆసుపత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు వారిని యార్గట్టి కి సమీపంలో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో బన్నూర్ అనే వ్యక్తి మహిళకు, బాలికకు బంధువు అని తెలుస్తోంది. అతనే ఈ ఘటనలో ప్రధాన నిందితుడని పోలీసులు వెల్లడించారు. ఇంట్లో దింపుతానని నమ్మబలికిన బన్నూర్, వారిద్దరినీ బండి ఎక్కించుకున్నాడు. తరువాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అతని స్నేహితులైన మరో నలుగురు సైతం అతనితో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే యార్గట్టిలో నిందితులను అరెస్టు చేశారు.