Telugu Global
CRIME

బంతి త‌గిలింద‌ని...హ‌త్య‌చేశారు!

పిల్ల‌వాడు ఆడుకుంటుండ‌గా బంతి త‌గిలిన‌ ఘ‌ట‌న ఒక హ‌త్య‌కు దారితీసిన‌ట్టుగా తెలుస్తోంది. ప‌శ్చిమ ఢిల్లీలోని వికాస్‌పురిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. 15మంది అగంతకులు గుంపుగా వ‌చ్చి ఒక పంటి డాక్ట‌రుని క‌ర్ర‌ల‌తో ఇనుప‌రాడ్ల‌తో కొట్టి హ‌త‌మార్చారు. డాక్ట‌ర్ పంక‌జ్ నారంగ్‌ (40) కుమారుడు ఆడుకుంటూ ఉండ‌గా బంతివెళ్లి ఒక వ్య‌క్తికి త‌గిలింది. అత‌ను మైన‌ర్ అని తెలుస్తోంది. ఈ విష‌యంలో డాక్ట‌రుకి, అత‌నికి గొడ‌వ జ‌రిగింది. త‌రువాత ఆ మైన‌రు కుర్రాడు, న‌జీర్ అనే త‌న స్నేహితునితో […]

బంతి త‌గిలింద‌ని...హ‌త్య‌చేశారు!
X

పిల్ల‌వాడు ఆడుకుంటుండ‌గా బంతి త‌గిలిన‌ ఘ‌ట‌న ఒక హ‌త్య‌కు దారితీసిన‌ట్టుగా తెలుస్తోంది. ప‌శ్చిమ ఢిల్లీలోని వికాస్‌పురిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. 15మంది అగంతకులు గుంపుగా వ‌చ్చి ఒక పంటి డాక్ట‌రుని క‌ర్ర‌ల‌తో ఇనుప‌రాడ్ల‌తో కొట్టి హ‌త‌మార్చారు. డాక్ట‌ర్ పంక‌జ్ నారంగ్‌ (40) కుమారుడు ఆడుకుంటూ ఉండ‌గా బంతివెళ్లి ఒక వ్య‌క్తికి త‌గిలింది. అత‌ను మైన‌ర్ అని తెలుస్తోంది. ఈ విష‌యంలో డాక్ట‌రుకి, అత‌నికి గొడ‌వ జ‌రిగింది. త‌రువాత ఆ మైన‌రు కుర్రాడు, న‌జీర్ అనే త‌న స్నేహితునితో బండిమీద వ‌చ్చి డాక్ట‌రుతో గొడ‌వ పెట్టుకున్నాడు. డాక్ట‌రు ఎదురు తిర‌గ‌టంతో బండి వ‌దిలేసి ఇద్ద‌రూ పారిపోయారు.

ఆ త‌రువాత గురువారం పొద్దుపోయాక ఆ ఇద్ద‌రూ మ‌రింత‌మందిని వెంట‌తీసుకువ‌చ్చారు. క‌ర్ర‌లు, ఇనుప‌రాడ్డుల‌తో డాక్ట‌రుపై దాడిచేసి అత‌డిని తీవ్రంగా కొట్టారు. డాక్ట‌రుని కాపాడేందుకు వ‌చ్చిన‌వారిని సైతం కొట్టారు. డాక్ట‌రు త‌ల‌కు తీవ్ర‌మైన గాయం కావ‌డంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. త‌రువాత స్థానికులు అందించిన స‌మాచారం మేర‌కు పోలీసులు వ‌చ్చి కేసులు న‌మోదు చేశారు. పోలీసులు శుక్ర‌వారం ఉద‌యానికి డాక్ట‌రు హ‌త్య‌లో పాల్గొన్న‌వారిలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. అరెస్టు చేయాల్సిన వారిలో ప్ర‌ధాన నిందితుడు న‌జీర్‌తో పాటు న‌లుగురు మైన‌ర్ వ‌య‌సున్న‌వారు ఉన్నారు. ఈ గొడ‌వంతా డాక్ట‌రు కొడుకు బంతి ఆట ఆడుకుంటుండ‌గా నిందితుల్లో ఒక‌రికి త‌గ‌ల‌టంతోనే మొద‌ల‌యింద‌ని, అదే హ‌త్య‌కు దారితీసిందని ఆ చుట్టుప‌క్క‌లవారు చెబుతున్నారు. అయితే పోలీసులు దీనిపై ఇంకా నిర్దార‌ణకు రాలేదు.

First Published:  25 March 2016 4:00 AM GMT
Next Story