Telugu Global
NEWS

నన్ను రూ. 20 కోట్లకు కొనబోయారు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

ఆపరేషన్  ఆకర్ష్ ని టీడీపీ తిరిగి మొదలుపెట్టింది. తాజాగా జ్యోతుల నెహ్రు, వరపుల సుబ్బారావు టీడీపీ గాలానికి చిక్కారు. వారికి భారీగా నగదుతో పోటు జ్యోతులకు మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైందని తెలుస్తోంది. వీరిద్దరితోపాటు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కూడా సైకిల్ ఎక్కుతారని ప్రచారం జరిగింది. అయితే ఆమె తాజాగా సంచలన ప్రకటన చేశారు. టీడీపీలోకి చేర్చుకునేందుకు తనకు రూ. 20 కోట్లను టీడీపీ నేతలు ఆశచూపారని ఆమె వెల్లడించారు. కానీ తాను […]

నన్ను రూ. 20 కోట్లకు కొనబోయారు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
X

ఆపరేషన్ ఆకర్ష్ ని టీడీపీ తిరిగి మొదలుపెట్టింది. తాజాగా జ్యోతుల నెహ్రు, వరపుల సుబ్బారావు టీడీపీ గాలానికి చిక్కారు. వారికి భారీగా నగదుతో పోటు జ్యోతులకు మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైందని తెలుస్తోంది. వీరిద్దరితోపాటు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కూడా సైకిల్ ఎక్కుతారని ప్రచారం జరిగింది. అయితే ఆమె తాజాగా సంచలన ప్రకటన చేశారు. టీడీపీలోకి చేర్చుకునేందుకు తనకు రూ. 20 కోట్లను టీడీపీ నేతలు ఆశచూపారని ఆమె వెల్లడించారు. కానీ తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యానంటే అందుకు జగనే కారణమన్నారు. చివరి వరకు వైసీపీలోనే ఉంటానన్నారు.

ఒక మారుమూల గ్రామానికి చెందిన తనకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసింది జగనేనన్నారు. అలాంటి తనపైనా ఇలాంటి కథనాలు ఎందుకు ప్రసారం చేస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి పత్రికలు, టీవీలు ఇష్టానుసారం కథనాలు రాస్తున్నాయని ఆక్షేపించారామె. కనీసం వివరణ తీసుకోకుండా ఎలా కథనాలు రాస్తారని ప్రశ్నించారు. రాజేశ్వరికి రూ. 20 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడ్డారంటే మిగిలిన ఎమ్మెల్యేలకు ధర ఇంకా బాగానే పలికి ఉండాలి.

Click on Image to Read:

chandrababu-naidu-rayalasee

bhuma1

jyotula-jagan-1

ktr-revanth

bhuma

jagan-assembly1213

jyotula-nehru

jd-laxminarayna

rajappa-jyotula

Aparna-Rao

bonda-roja

ysr-sai-pratap

jagan sai pratap

women

jc-raghuveera

jagapathi

jaleel-khan

ts-assembly

ysrcp MLA Subba rao

yanamala

yuvaraj dhoni

balakrishna

jc-diwakar-jagan-chandrababu

First Published:  28 March 2016 10:11 PM GMT
Next Story