భార్య పెళ్లికి భర్త ప్రకటన... భర్తను పొడిచిన పెళ్లిచూపులకు వచ్చిన వ్యక్తి
తన నుంచి విడిపోదామనుకున్న భార్యకు పెళ్లి సంబంధం చూశాడు ఓ భర్త. తీరా వరుడు పెళ్లిచూపులకు అని ఇంటికి వచ్చాడు. తరువాత చెలరేగిన గొడవలో వరుడు భర్తను పొడిచి పరారయ్యాడు. గతంలో ఇలాంటి ఘటనలు ఈవీవీ సినిమాల్లో జరిగేవి. కానీ, తాజా సంఘటన హైదరాబాద్లోనే జరిగింది. శ్వేత, మహేందర్ అనే దంపతులు బేగంపేటలో నివసిస్తున్నారు. వీరికి ఒక బాబు. ఇద్దరూ ఉద్యోగులే. ఇటీవల కాపురంలో కలహాలు రేగి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. తనకు మంచి సంబంధం చూడాలని […]
BY sarvi5 April 2016 11:17 PM GMT
X
sarvi Updated On: 5 April 2016 11:30 PM GMT
తన నుంచి విడిపోదామనుకున్న భార్యకు పెళ్లి సంబంధం చూశాడు ఓ భర్త. తీరా వరుడు పెళ్లిచూపులకు అని ఇంటికి వచ్చాడు. తరువాత చెలరేగిన గొడవలో వరుడు భర్తను పొడిచి పరారయ్యాడు. గతంలో ఇలాంటి ఘటనలు ఈవీవీ సినిమాల్లో జరిగేవి. కానీ, తాజా సంఘటన హైదరాబాద్లోనే జరిగింది. శ్వేత, మహేందర్ అనే దంపతులు బేగంపేటలో నివసిస్తున్నారు. వీరికి ఒక బాబు. ఇద్దరూ ఉద్యోగులే. ఇటీవల కాపురంలో కలహాలు రేగి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. తనకు మంచి సంబంధం చూడాలని భార్య అడగ్గానే సరేనన్నాడు. భార్య మ్యాట్రిమోనీలో ఇచ్చిన ప్రకటన చూసి అదే ప్రాంతంలో నివసించే.. కృష్ణమూర్తి అనే వ్యక్తి శ్వేతను సంప్రదించాడు. అతని ప్రవర్తన ఎలాంటిదో తెలుసుకోవాలని భర్తను కోరింది. అతని గురించి వాకబు చేసి మంచివాడు కాదని తేల్చాడు మహేందర్. తీరా పెళ్లి చూపులకు వచ్చిన కృష్ణమూర్తితో.. శ్వేత-మహేందర్ దంపతులు నీ క్యారెక్టర్ మంచిది కాదంటూ గొడవకు దిగారు. గొడవ ముదిరింది కోపంతో కృష్ణమూర్తి పక్కనే ఉన్న కత్తిని తీసుకుని మహేందర్ను పొడిచి పారిపోయాడు. చుట్టుపక్కల వారి సాయంతో మహేందర్ను ఆసుపత్రిలో చేర్చారు.
Next Story