Telugu Global
CRIME

భ‌ర‌ణం అడిగితే… కోర్టులోనే  గొంతుకోశాడు!

త‌న భ‌ర్త త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, భ‌ర‌ణం ఇప్పించాల‌ని కోరుతూ కోర్టుని ఆశ్ర‌యించిన ఓ మ‌హిళ‌పై న్యాయ‌స్థానం ఆవ‌ర‌ణ‌లోనే ఆమె భ‌ర్త క‌త్తితో దాడిచేశాడు. హైద‌రాబాద్ న‌గ‌ర శివారుల్లో ఉన్న రాజేంద్ర న‌గ‌ర్ కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఈ దారుణం జ‌రిగింది. లంగ‌ర్‌హౌస్‌కి చెందిన నాగేంద‌ర్ బాబు, సౌజ‌న్య భార్యాభ‌ర్త‌లు. వారికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో ఏడాదిన్న‌ర కింద విడాకుల‌కోసం కోర్టుకి వెళ్లారు. త‌న భ‌ర్త ఈ మ‌ధ్య‌కాలంలో మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర […]

భ‌ర‌ణం అడిగితే… కోర్టులోనే  గొంతుకోశాడు!
X

త‌న భ‌ర్త త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, భ‌ర‌ణం ఇప్పించాల‌ని కోరుతూ కోర్టుని ఆశ్ర‌యించిన ఓ మ‌హిళ‌పై న్యాయ‌స్థానం ఆవ‌ర‌ణ‌లోనే ఆమె భ‌ర్త క‌త్తితో దాడిచేశాడు. హైద‌రాబాద్ న‌గ‌ర శివారుల్లో ఉన్న రాజేంద్ర న‌గ‌ర్ కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఈ దారుణం జ‌రిగింది. లంగ‌ర్‌హౌస్‌కి చెందిన నాగేంద‌ర్ బాబు, సౌజ‌న్య భార్యాభ‌ర్త‌లు. వారికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో ఏడాదిన్న‌ర కింద విడాకుల‌కోసం కోర్టుకి వెళ్లారు. త‌న భ‌ర్త ఈ మ‌ధ్య‌కాలంలో మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకుని త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, భ‌ర్త నుండి భ‌ర‌ణం ఇప్పించాల‌ని సౌజ‌న్య కోర్టుని కోరింది. ఈ విష‌యంపై విచార‌ణ జ‌రిగిన అనంత‌రం కోర్టు బ‌య‌ట‌కు రాగానే నాగేంద‌ర్ త‌న వెంట తెచ్చుకున్న క‌త్తితో భార్య గొంతు కోశాడు. ఈ హ‌ఠాత్ప‌రిణామానికి అక్క‌డున్న‌వారంతా భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. సౌజ‌న్య‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమె ప‌రిస్థితి విష‌యంగా ఉంద‌ని తెలుస్తోంది.

First Published:  11 April 2016 6:07 AM GMT
Next Story