ప్రియాంక చోప్రాకు బంగారు గాజులు చేయించిన ఏపీ ఎంపీ
కళాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించడంలో ముందుండే రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డి మరోసారి తన తీరును కొనసాగించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను ఘనంగా సత్కరించారు. ప్రియాంక అవార్డు తీసుకున్న సందర్భంగా ఢిల్లీలో సుబ్బరామిరెడ్డి ప్రత్యేక విందు ఇచ్చారు. కార్యక్రమానికి మోహన్బాబుతో పాటు పలువురు వీఐపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు గాజులను అందజేశారు. నటుడు మోహన్బాబు, సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డిలు ఈ గాజులను […]
కళాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించడంలో ముందుండే రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డి మరోసారి తన తీరును కొనసాగించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను ఘనంగా సత్కరించారు. ప్రియాంక అవార్డు తీసుకున్న సందర్భంగా ఢిల్లీలో సుబ్బరామిరెడ్డి ప్రత్యేక విందు ఇచ్చారు. కార్యక్రమానికి మోహన్బాబుతో పాటు పలువురు వీఐపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు గాజులను అందజేశారు. నటుడు మోహన్బాబు, సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డిలు ఈ గాజులను ప్రియాంకకు తొడిగారు. కళలను, సంస్కృతిని ప్రోత్సహించడం తమ టీఎస్ఆర్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో భాగమని సుబ్బరామిరెడ్డి చెప్పారు. మిస్ వరల్డ్ గా ఎన్నికవడంతో పాటు బాలీవుడ్లో నటిగా సత్తా చాటుతూ హాలీవుడ్లోనూ ప్రతిభ కనబరిచిన ప్రియాంకను మొచ్చుకోకుండా ఉండలేకపోతున్నామన్నారు.
Click on Image to Read: