Telugu Global
CRIME

కృష్ణాన‌దిలో న‌లుగురు కుర్రాళ్ల గ‌ల్లంతు!

కృష్ణాజిల్లా, కోడూరు మండ‌లం విశ్వ‌నాథ ప‌ల్లిలో విషాదం చోటుచేసుకుంది. కృఫ్ణాన‌దిలో స్నానానికి దిగిన న‌లుగురు కుర్రాళ్లు గ‌ల్లంత‌య్యారు. 14 నుండి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వీరంతా నాంచార‌మ్మ ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. వారు స్నానానికి దిగిన ప్రాంతంలో లోతు ఎక్కువ‌గా ఉంటుంద‌ని మ‌త్స్య‌కారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో మ‌త్స్య‌కారులు ఎక్కువ‌గా ఉండ‌టంతో వ‌ల‌లు, బోట్లు ఉప‌యోగించి గ‌ల్లంత‌యిన వారికోసం వెతుకుతున్నారు. రెవెన్యూ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గాలింపు చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయి. కృష్ణాన‌ది స‌ముద్రంలో క‌లిసే ప్రాంతం ఇక్క‌డ‌కు […]

కృష్ణాన‌దిలో న‌లుగురు కుర్రాళ్ల గ‌ల్లంతు!
X

కృష్ణాజిల్లా, కోడూరు మండ‌లం విశ్వ‌నాథ ప‌ల్లిలో విషాదం చోటుచేసుకుంది. కృఫ్ణాన‌దిలో స్నానానికి దిగిన న‌లుగురు కుర్రాళ్లు గ‌ల్లంత‌య్యారు. 14 నుండి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వీరంతా నాంచార‌మ్మ ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. వారు స్నానానికి దిగిన ప్రాంతంలో లోతు ఎక్కువ‌గా ఉంటుంద‌ని మ‌త్స్య‌కారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో మ‌త్స్య‌కారులు ఎక్కువ‌గా ఉండ‌టంతో వ‌ల‌లు, బోట్లు ఉప‌యోగించి గ‌ల్లంత‌యిన వారికోసం వెతుకుతున్నారు. రెవెన్యూ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గాలింపు చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయి. కృష్ణాన‌ది స‌ముద్రంలో క‌లిసే ప్రాంతం ఇక్క‌డ‌కు చేరువ‌గా ఉంటుంద‌ని మ‌త్స్య‌కారులు అంటున్నారు.

First Published:  21 April 2016 10:32 PM GMT
Next Story