Telugu Global
International

లైంగిక బానిస‌త్వాన్ని కాద‌న్నార‌ని... 250మంది మ‌హిళ‌ల‌ను చంపేశారు!

ఐఎస్ ఉగ్ర‌వాదుల క్రూర‌త్వానికి ప‌రాకాష్ట ఇది. త‌మ‌ను తాత్కాలిక వివాహం చేసుకుని లైంగిక జిహాద్‌లో పాలుపంచుకోవాల‌ని ఇరాక్‌లోని మోసుల్ న‌గ‌రానికి చెందిన అమ్మాయిల‌ను ఉగ్ర‌వాదులు బ‌ల‌వంత‌పెడుతున్నారు. ఇందుకు ఒప్పుకోని వారి ప్రాణాలు తీస్తున్నారు. అలా 250మంది అమ్మాయిల‌ను వారు పొట్ట‌న‌పెట్టుకున్నార‌ని కుర్దిష్ డెమొక్రాటిక్ పార్టీ అధికార ప్ర‌తినిధి మామూజినీ తెలిపారు. పెళ్లికి ఒప్పుకోని అమ్మాయిల‌నే కాక వారి త‌ల్లిదండ్రుల‌ను సైతం ఉగ్ర‌వాదులు హ‌త‌మారుస్తున్నారు. లండ‌న్‌లోని కుర్దిష్ న్యూస్ ఏజ‌న్సీకి ఆయ‌న ఈ స‌మాచారం ఇచ్చారు. లైంగిక బానిస‌త్వాన్ని […]

లైంగిక బానిస‌త్వాన్ని కాద‌న్నార‌ని...  250మంది మ‌హిళ‌ల‌ను చంపేశారు!
X

ఐఎస్ ఉగ్ర‌వాదుల క్రూర‌త్వానికి ప‌రాకాష్ట ఇది. త‌మ‌ను తాత్కాలిక వివాహం చేసుకుని లైంగిక జిహాద్‌లో పాలుపంచుకోవాల‌ని ఇరాక్‌లోని మోసుల్ న‌గ‌రానికి చెందిన అమ్మాయిల‌ను ఉగ్ర‌వాదులు బ‌ల‌వంత‌పెడుతున్నారు. ఇందుకు ఒప్పుకోని వారి ప్రాణాలు తీస్తున్నారు. అలా 250మంది అమ్మాయిల‌ను వారు పొట్ట‌న‌పెట్టుకున్నార‌ని కుర్దిష్ డెమొక్రాటిక్ పార్టీ అధికార ప్ర‌తినిధి మామూజినీ తెలిపారు. పెళ్లికి ఒప్పుకోని అమ్మాయిల‌నే కాక వారి త‌ల్లిదండ్రుల‌ను సైతం ఉగ్ర‌వాదులు హ‌త‌మారుస్తున్నారు. లండ‌న్‌లోని కుర్దిష్ న్యూస్ ఏజ‌న్సీకి ఆయ‌న ఈ స‌మాచారం ఇచ్చారు.

లైంగిక బానిస‌త్వాన్ని అంగీక‌రించ‌ని మ‌హిళ‌ల‌ను ఐఎస్ ఉగ్ర‌వాదులు త‌ర‌చుగా హ‌త్య చేస్తున్నారు. గ‌త ఏడాది ఆగస్టులో 19మంది మ‌హిళ‌ల‌ను ఇలాగే దారుణంగా చంపేశారు. 2014 ఆగ‌స్టులో 500మంది యాజిదీ తెగ‌కు చెందిన మ‌హిళ‌లు, యువ‌తుల‌ను కిడ్నాప్ చేసిన ఉగ్ర‌వాదులు వారిపై అత్యంత దారుణంగా అత్యాచారాలు చేశారు. అదే ఏడాది అక్టోబ‌రులో 500మందికి పైనే మ‌హిళ‌ల‌ను బంధించారు. జూన్ 2014 నుండి మోసుల్ న‌గ‌రాన్ని త‌మ అధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్ మూక‌లు అక్క‌డ బీభ‌త్సాన్ని సృష్టిస్తున్నారు.

First Published:  22 April 2016 1:05 AM GMT
Next Story