కొన్ని సంవత్సరాల గాఢ స్నేహం...ఆపై అత్యాచారం!
కునాల్ దేశాయి (19) అనే కాలేజి విద్యార్థి తన స్నేహితురాలిపై అత్యాచారం చేసి, హత్యకు ప్రయత్నించిన ఘటన దక్షిణ ముంబయిలో చోటుచేసుకుంది. కునాల్ దేశాయి, అతనితో పాటు కాలేజిలో చదువుతున్న అతని స్నేహితురాలైన 17ఏళ్ల యువతి ఇద్దరూ కలిసి ముంబయికి వెళ్లారు. అక్కడో హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. కునాల్ ఆమెపై అత్యాచారం చేశాడు. తరువాత గొంతు పిసికి చంపాలనుకున్నాడు. యువతి కేకలు వేయటంతో తప్పించుకోగలిగింది. కునాల్ అక్కడి నుండి తప్పించుని పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు […]
కునాల్ దేశాయి (19) అనే కాలేజి విద్యార్థి తన స్నేహితురాలిపై అత్యాచారం చేసి, హత్యకు ప్రయత్నించిన ఘటన దక్షిణ ముంబయిలో చోటుచేసుకుంది. కునాల్ దేశాయి, అతనితో పాటు కాలేజిలో చదువుతున్న అతని స్నేహితురాలైన 17ఏళ్ల యువతి ఇద్దరూ కలిసి ముంబయికి వెళ్లారు. అక్కడో హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. కునాల్ ఆమెపై అత్యాచారం చేశాడు. తరువాత గొంతు పిసికి చంపాలనుకున్నాడు. యువతి కేకలు వేయటంతో తప్పించుకోగలిగింది. కునాల్ అక్కడి నుండి తప్పించుని పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కునాల్ కోసం గాలించి, గుజరాత్లోని వడోదరలో అరెస్టు చేశారు. అతనిపై అత్యాచారంతో పాటు హత్యాయత్నం నేరం నమోదు చేశారు. కునాల్, బాధితురాలు ఇద్దరూ సెంట్రల్ ముంబయిలోని దాదర్ ప్రాంతానికి చెందినవారని, వారిద్దరికీ కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.