కొడుకు అమ్మాయితో పారిపోయాడు...తల్లిని శిక్షించారు!
ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖెరీ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కొడుకు ఒక యువతిని తీసుకుని పారిపోతే ఆ యువతి తరపువారు అతని తల్లిని చిత్రహింసలు పెట్టారు. ఖెరీ గ్రామానికే చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. తమ ప్రేమని పెద్దలు అంగీకరించకపోవడంతో ఇంట్లోంచి పారిపోయారు. దాంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయి తరపువారు యువకుని తల్లిని చిత్రహింసలకు గురిచేశారు. దాదాపు 60 సంవత్సరాల వయసున్న ఆ మహిళ మొహానికి మసిపూసి, ఆమె శరీర […]
ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖెరీ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కొడుకు ఒక యువతిని తీసుకుని పారిపోతే ఆ యువతి తరపువారు అతని తల్లిని చిత్రహింసలు పెట్టారు. ఖెరీ గ్రామానికే చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. తమ ప్రేమని పెద్దలు అంగీకరించకపోవడంతో ఇంట్లోంచి పారిపోయారు. దాంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయి తరపువారు యువకుని తల్లిని చిత్రహింసలకు గురిచేశారు. దాదాపు 60 సంవత్సరాల వయసున్న ఆ మహిళ మొహానికి మసిపూసి, ఆమె శరీర భాగాల్లో కారం చల్లి నరకాన్ని చూపించారు. ఈ దారుణంలో నలుగురు మహిళలు సైతం పాలుపంచుకున్నారు. మహిళ భర్త గ్రామస్తులను సహాయం కోరటంతో వారు వచ్చి ఆమెని రక్షించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నలుగురు మహిళలతో పాటు అయిదుగురిపై కేసు నమోదుచేశారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారు.