Telugu Global
CRIME

మాంసం తిన‌మంటూ భ‌ర్త వేధింపులు...భార్య ప్రాణం తీశాయి!

మాంసం తిన‌మంటూ భ‌ర్త పెడుతున్న పోరుని భ‌రించ‌లేక ఒక యువ‌తి (22) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ముంబ‌యి శివారు ప్రాంత‌మైన న‌ల‌సోప‌రాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇమిటేష‌న్ జ్యుయ‌ల‌రీ కంపెనీలో ప‌నిచేస్తున్న పూజా ధీర‌జ్ పూర్తిగా శాకాహారి. ఆమె భ‌ర్త ధీరజ్ లుక‌మ్, పూజ‌ని మాంసాహారం తిన‌మ‌ని ఒత్తిడి పెట్ట‌డంతో పాటు, ఉద్యోగం మానేయ‌ని కూడా హింసించేవాడ‌ని పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. ఆమె మాంసాహారం తినేందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో అత‌ని వేధింపులు మ‌రింత‌గా పెరిగిపోయాయ‌ని, వాటిని త‌ట్టుకోలేకే  పూజ ఆత్మ‌హ‌త్య […]

మాంసం తిన‌మంటూ భ‌ర్త వేధింపులు...భార్య ప్రాణం తీశాయి!
X

మాంసం తిన‌మంటూ భ‌ర్త పెడుతున్న పోరుని భ‌రించ‌లేక ఒక యువ‌తి (22) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ముంబ‌యి శివారు ప్రాంత‌మైన న‌ల‌సోప‌రాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇమిటేష‌న్ జ్యుయ‌ల‌రీ కంపెనీలో ప‌నిచేస్తున్న పూజా ధీర‌జ్ పూర్తిగా శాకాహారి. ఆమె భ‌ర్త ధీరజ్ లుక‌మ్, పూజ‌ని మాంసాహారం తిన‌మ‌ని ఒత్తిడి పెట్ట‌డంతో పాటు, ఉద్యోగం మానేయ‌ని కూడా హింసించేవాడ‌ని పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది.

ఆమె మాంసాహారం తినేందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో అత‌ని వేధింపులు మ‌రింత‌గా పెరిగిపోయాయ‌ని, వాటిని త‌ట్టుకోలేకే పూజ ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని ఆమె బంధువులు పోలీసుల‌కు వెల్ల‌డించారు. పూజ భ‌ర్త‌ని పోలీసులు అరెస్టు చేశారు.

First Published:  27 April 2016 11:07 PM GMT
Next Story