నా భర్తను ఐఏఎస్ రేఖారాణి పెళ్లి చేసుకుంది, న్యాయం చేయండి " నటి
అలనాటి హీరోయిన్, నేటి బుల్లితెర నటి పూజిత న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. తన భర్త విజయగోపాల్ తనను మోసం చేసి ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని పెళ్లి చేసుకున్నారని చెబుతోంది. రేఖారాణి.. అధికారి పరదేశీనాయుడు కుటుంబానికి చెందిన మహిళ అని పూజిత వెల్లడించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా బెదిరిస్తున్నారని ఆరోపించారు. రేఖారాణికి అండగా ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా తనను ఎన్ కౌంటర్ చేస్తానంటూ బెదిరిస్తోందని ఆరోపించారు. తనకు, తన కుమారుడికి ప్రాణహానీ ఉందని వాపోయారు. విజయగోపాల్ పెద్ద […]
అలనాటి హీరోయిన్, నేటి బుల్లితెర నటి పూజిత న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. తన భర్త విజయగోపాల్ తనను మోసం చేసి ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని పెళ్లి చేసుకున్నారని చెబుతోంది. రేఖారాణి.. అధికారి పరదేశీనాయుడు కుటుంబానికి చెందిన మహిళ అని పూజిత వెల్లడించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా బెదిరిస్తున్నారని ఆరోపించారు. రేఖారాణికి అండగా ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా తనను ఎన్ కౌంటర్ చేస్తానంటూ బెదిరిస్తోందని ఆరోపించారు.
తనకు, తన కుమారుడికి ప్రాణహానీ ఉందని వాపోయారు. విజయగోపాల్ పెద్ద మోసగాడు అన్న విషయం పెళ్లి జరిగిన కొన్ని రోజులకే అర్థమైందన్నారు. అతడి అప్పులు తీర్చేందుకు తానుచాలా డబ్బును పోగొట్టుకున్నానని వెల్లడించారు. సినిమా జర్నలిస్టుగా తనకు పరిచయం అయి పెళ్లి చేసుకున్నారని చెప్పారు. రేఖారాణిని మూడు రోజుల క్రితం విజయగోపాల్ పెళ్లి చేసుకున్నారని చెప్పారు. రిజిస్ట్రార్ … రేఖారాణి ఇంటికే వెళ్లి పెళ్లి చేశారన్నారు. తనను మోసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
తనతో విజయగోపాల్ కు పెళ్లి జరిగిన మాట వాస్తవమేనని ఐఏఎస్ రేఖారాణి కూడా చెప్పారు. అయితే విజయగోపాల్, పూజిత విడిపోయి పదేళ్లు అయిందని చెప్పారు. అందుకే తాను పెళ్లి చేసుకున్నానని అన్నారు. ఏదైనా ఉంటే పూజిత కోర్టుకు వెళ్లాలని సూచించారు. మీడియా ద్వారా రచ్చ చేయడం సరికాదన్నారు. తన నుంచి పూజితకు ఎలాంటి ప్రాణహాని ఉండదని చెప్పారు. లీగల్ గా అన్నీ చూసుకునే పెళ్లి చేసుకున్నామని ఆమె చెప్పారు.
Click on Image to Read: