Telugu Global
National

రాహుల్‌ని చంపేస్తాం...బెదిరింపు లేఖ‌!

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీని ముక్క‌లు చేస్తామంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఓ లేఖ రాశారు. పుదుచ్చేరిలో సోమ‌వారం ఈ లేఖ‌ని మాజీ కేంద్ర‌మంత్రి వి.నారాయ‌ణ‌స్వామి త‌న ఇంట్లో అందుకున్నారు. ఈ నెల 16న ఇక్క‌డ అసెంబ్లీ  ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాహుల్ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌జార్యాలీలో పాల్గొనాల్సి ఉంది. ఎవ‌రు పంపారో తెలియ‌ని ఈ ఉత్త‌రంలో,  కాంగ్రెస్ పార్టీ విధానాల వ‌ల‌న కూలీలు, శ్రామికులు క‌ష్టాల పాల‌య్యార‌ని, ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు మూత ప‌డ‌టం వ‌ల‌న […]

రాహుల్‌ని చంపేస్తాం...బెదిరింపు లేఖ‌!
X

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీని ముక్క‌లు చేస్తామంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఓ లేఖ రాశారు. పుదుచ్చేరిలో సోమ‌వారం ఈ లేఖ‌ని మాజీ కేంద్ర‌మంత్రి వి.నారాయ‌ణ‌స్వామి త‌న ఇంట్లో అందుకున్నారు. ఈ నెల 16న ఇక్క‌డ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాహుల్ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌జార్యాలీలో పాల్గొనాల్సి ఉంది. ఎవ‌రు పంపారో తెలియ‌ని ఈ ఉత్త‌రంలో, కాంగ్రెస్ పార్టీ విధానాల వ‌ల‌న కూలీలు, శ్రామికులు క‌ష్టాల పాల‌య్యార‌ని, ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు మూత ప‌డ‌టం వ‌ల‌న వ‌ర్క‌ర్లు బాధ‌లు ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు.

నారాయ‌ణ‌స్వామి ఇత‌ర కాంగ్రెస్ నేత‌లు దీనిపై స్పందిస్తూ, ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్‌కి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేస్తున్నారు. ఈ ఉత్త‌రాన్ని పుదుచ్చేరిలోనే పోస్ట్ చేశార‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో క‌నుగొన్నారు. కేంద్ర హోం శాఖా మంత్రి రాజనాథ్ సింగ్‌ని, రాహుల్ ర‌క్ష‌ణ‌కోసం అద‌న‌పు సెక్యురిటీని ఇవ్వాల్సిందిగా కోరాల‌ని కాంగ్రెస్ నేత‌లు నిర్ణ‌యించుకున్నారు.

First Published:  9 May 2016 1:01 AM GMT
Next Story