Telugu Global
NEWS

జైలుకైనా వెళ్తా జ‌గ‌న్‌తోనే ఉంటా!. బెంగ‌ళూరు వ‌చ్చి సీఎం నన్నేం చేస్తారు?

తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ కార్యాయలంలో మీడియాతో మాట్లాడిన ప్రతాప్ రెడ్డి వైసీపీని వీడే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ నేతలు తనతో చర్చలు జరిపిన మాట వాస్తవమేనన్నారు. అయితే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని నేరుగా మంత్రి నారాయణకే చెప్పానన్నారు. పార్టీలోకి వస్తే డబ్బులిస్తాం, పనులు చేసిపెడుతాం, బెనిఫిట్స్ ఉంటాయంటూ ఆఫర్లు ఇచ్చారన్నారు. కేసు విషయం ప్రస్తావించి […]

జైలుకైనా వెళ్తా జ‌గ‌న్‌తోనే ఉంటా!. బెంగ‌ళూరు వ‌చ్చి సీఎం నన్నేం చేస్తారు?
X

తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ కార్యాయలంలో మీడియాతో మాట్లాడిన ప్రతాప్ రెడ్డి వైసీపీని వీడే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ నేతలు తనతో చర్చలు జరిపిన మాట వాస్తవమేనన్నారు. అయితే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని నేరుగా మంత్రి నారాయణకే చెప్పానన్నారు. పార్టీలోకి వస్తే డబ్బులిస్తాం, పనులు చేసిపెడుతాం, బెనిఫిట్స్ ఉంటాయంటూ ఆఫర్లు ఇచ్చారన్నారు.

కేసు విషయం ప్రస్తావించి కూడా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు. కేసులు పెడితే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని, జగన్‌ను వ‌దిలి మాత్రం వెళ్ల‌బోన‌న్నారు. ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక ప‌నిగట్టుకుని తప్పుడు క‌థ‌నాలు రాస్తోంద‌ని మండిప‌డ్డారు. ఆంధ్ర‌జ్యోతి తెలుగుదేశం పత్రిక‌లా ప‌నిచేస్తోందే త‌ప్పా ఆ ప‌త్రిక వ‌ల్ల స‌మాజానికి ఏమాత్రం ఉప‌యోగం లేద‌న్నారు.

వ్యాపారం దెబ్బ‌తీసేందుకు టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంద‌న్న భయం లేదా అన్న ప్ర‌శ్న‌కు త‌న వ్యాపారాలన్నీ బెంగ‌ళూరులో ఉన్నాయ‌ని చెప్పారు. అక్క‌డికి వ‌చ్చి చంద్ర‌బాబు, నారాయ‌ణ త‌న‌ను ఏం చేయ‌గ‌ల‌ర‌ని ప్ర‌శ్నించారు ప్ర‌తాప్ రెడ్డి. తాను వ్యాపార‌వేత్త‌ను కాబ‌ట్టి సాప్ట్‌గానే ఉంటాన‌ని దాన్ని అలుసుగా తీసుకోవ‌ద్ద‌న్నారు.

అవినీతి డ‌బ్బుతో ఎమ్మెల్యేల‌ను కొంటూ ప్ర‌జాస్వామ్యాన్ని చంద్ర‌బాబు అప‌హాస్యం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. హెరిటేజ్ డైరెక్ట‌ర్ మెట‌ప‌ర్తి వ‌ర‌ప్ర‌సాద్ పేరు ప‌నామా ప‌త్రాల్లో ఉండ‌డంపై చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాల‌న్నారు. ఇటీవ‌ల పార్టీ మారిన సునీల్ కుమార్ నియోజ‌క‌వ‌ర్గానికి తాను వెళ్లాన‌ని అక్క‌డి జ‌నం వారిని అస‌హ్యించుకుంటున్నార‌ని ప్ర‌తాప్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేల‌ను కొన్నంత మాత్రాన ప్ర‌జ‌లు కూడా వ‌చ్చేస్తార‌నుకోవ‌డం పొర‌పాటు అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని ప్రతాప్ రెడ్డి సవాల్ విసిరారు.

Click on Image to Read:

CM-Ramesh

revanth-reddy

pratap-reddy

chandrababu-naidu

pratyusha-madileti-kcr

CNN

Rosaiah,-EVKS-Elangovan

swamy

heritage1

First Published:  12 May 2016 3:40 AM GMT
Next Story