సరైనోడికి సిసలైన షాక్
సినిమా వంద కోట్ల క్లబ్లో చేరింది. ప్రస్తుతం రికార్డులు తిరగరాస్తోంది. మొదటి 5 సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇలా ఓ రేంజ్ లో బన్నీ సినిమాపై ప్రచారం సాగుతోంది. బన్నీ తండ్రి కమ్ సరైనోడు నిర్మాత అల్లు అరవింద్ ఈ ప్రచారాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారు. అయితే ఈ అతి ప్రచారం ఇప్పుడు అరవిందుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. సరైనోడుకు డబ్బులు రాబట్టుకోవడానికి చేసిన విపరీతమైన పబ్లిసిటీ మొదటికే ముప్పు తెచ్చింది. యూనిట్ వరుసగా ఇస్తున్న ప్రకటనలపై […]
BY sarvi13 May 2016 11:01 PM GMT
sarvi Updated On: 13 May 2016 11:01 PM GMT
సినిమా వంద కోట్ల క్లబ్లో చేరింది. ప్రస్తుతం రికార్డులు తిరగరాస్తోంది. మొదటి 5 సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇలా ఓ రేంజ్ లో బన్నీ సినిమాపై ప్రచారం సాగుతోంది. బన్నీ తండ్రి కమ్ సరైనోడు నిర్మాత అల్లు అరవింద్ ఈ ప్రచారాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారు. అయితే ఈ అతి ప్రచారం ఇప్పుడు అరవిందుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. సరైనోడుకు డబ్బులు రాబట్టుకోవడానికి చేసిన విపరీతమైన పబ్లిసిటీ మొదటికే ముప్పు తెచ్చింది. యూనిట్ వరుసగా ఇస్తున్న ప్రకటనలపై ఆదాయపు పన్నుశాఖ దృష్టిపెట్టింది. వంద కోట్లు… 150కోట్లు అంటూ వస్తున్న ప్రకటనలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. నేరుగా గీతా ఆర్స్ అధినేత అల్లు అరవింద్కు నోటీసులు పంపిన ఐటీ శాఖ… వంద కోట్ల ఆదాయ వస్తే పన్ను ఎందుకు చెల్లించరని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సరైనోడు రిలీజ్ తరువాత అగ్రకథానాయకుల చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అవ్వడం, సుప్రీమ్ కూడా యావరేజ్గా నిలవడంతో సరైనోడు కలెక్షన్లకు లోటు లేకుండా పోయింది. అయితే ఈ సినిమా ప్రచారంలో చెప్పినన్ని వసూళ్లు నిజంగా వచ్చాయా లేదా అనే విషయం ఐటీకి సమర్పించే అఫిడవిట్ తో తేలిపోతుంది.
Next Story