నిర్లక్ష్యం చేస్తున్నాడని...నాలుగులీటర్ల యాసిడ్ కుమ్మరించింది!
ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్ జిల్లా, వైశాలి ప్రాంతంలో ఒక మహిళ (45), అమిత్ వర్మ (28) అనే పశువుల వైద్యునిమీద నాలుగు లీటర్ల యాసిడ్ని కుమ్మరించేసింది. ఆమె ఏకంగా యాసిడ్ని బకెట్తోనే తెచ్చింది. వివరాల్లోకి వెళితే….అలీఘడ్కు చెందిన అమిత్ వర్మ ప్రస్తుత ఉద్యోగానికి ముందు మీరట్లో ఒక పశువధశాలలో వైద్యునిగా పనిచేసేవాడు. అక్కడ అతను ఒక రూములో అద్దెకు ఉండేవాడు. ఆ ఇంటి ఓనరే ఈ మహిళ. అమిత్ ఆమెతో అప్పట్లో సన్నిహితంగా ఉండేవాడు. తరువాత అతను […]
ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్ జిల్లా, వైశాలి ప్రాంతంలో ఒక మహిళ (45), అమిత్ వర్మ (28) అనే పశువుల వైద్యునిమీద నాలుగు లీటర్ల యాసిడ్ని కుమ్మరించేసింది. ఆమె ఏకంగా యాసిడ్ని బకెట్తోనే తెచ్చింది. వివరాల్లోకి వెళితే….అలీఘడ్కు చెందిన అమిత్ వర్మ ప్రస్తుత ఉద్యోగానికి ముందు మీరట్లో ఒక పశువధశాలలో వైద్యునిగా పనిచేసేవాడు. అక్కడ అతను ఒక రూములో అద్దెకు ఉండేవాడు. ఆ ఇంటి ఓనరే ఈ మహిళ. అమిత్ ఆమెతో అప్పట్లో సన్నిహితంగా ఉండేవాడు. తరువాత అతను మీరట్ నుండి వైశాలికి వచ్చేశాక ఆమెను కలవటం కుదిరేది కాదు. అయితే ఇది నచ్చని ఆ మహిళ అతని వెంటపడుతుండేది. గత 18 రోజుల్లో ఆ మహిళ మూడుసార్లు అమిత్ని కలిసిందని, ఈ వివరాలన్నీ తెలిపిన అతని రూమ్మేటు దీపక్ చెప్పాడు.
గత శని ఆదివారాల్లో ఆమె అమిత్కి దాదాపు 100కంటే ఎక్కువసార్లు కాల్ చేసిందని కూడా అతను వెల్లడించాడు. ఈ నేపథ్యంలో అమిత్ తనని నిర్లక్ష్యం చేస్తున్నాడనే ఆగ్రహానికి గురైన ఆ మహిళ సోమవారం అమిత్ పనిచేస్తున్న ఆసుపత్రికి వచ్చింది. పడక కుర్చీలాంటి దాంట్లో నిద్రపోతున్న అమిత్ మీద ఒక్కసారిగా బకెట్తో తెచ్చిన యాసిడ్ని కుమ్మరించి పారిపోయింది. ఆసుపత్రి పక్కనే వారు నివాసం ఉంటున్న ఇల్లు ఉండటంతో అమిత్ కేకలు విన్న దీపక్ పరిగెత్తుకుని వచ్చి అమిత్ని వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అప్పుడే అమిత్ నోటి నుండి తాను ఆంటీ…అనే మాటని విన్నట్టుగా దీపక్ తెలిపాడు. ప్రస్తుతం అమిత్ 40శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను మాట్లాడే స్థితిలో లేడు. ఆ మహిళ తమని తప్పుదారి పట్టించడానికి అమిత్పై యాసిడ్ పోశాక ఆ ప్రాంతంలో మరొక మహిళ ఐడెంటిటి కార్డు ఉన్న ఒక పర్సుని వదిలేసి వెళ్లినట్టుగా పోలీసులు వెల్లడించారు. అమిత్ కాస్త కోలుకుని మాట్లాడితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని వారు తెలిపారు.