భారత్...మాత...మమత!
ఇప్పుడు ఒక విషయం గురించి ఎంతమంది ఏమని మాట్లాడుకుంటున్నారు….అనే ప్రశ్నకు కచ్ఛితంగా సరైన సమాధానాన్ని తెలుసుకునే వీలు ఉంది. వందల, వేల గళాలను, అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి తెస్తున్నాయి. నిజానికి వీటిలో కనిపించే కామెంట్లలో ఒక్కోసారి మంచి హాస్య చతురత, సృజనాత్మకత కూడా ఉంటున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పశ్చిమబెంగాల్లో విజయం సాధించిన మమతా దీదీని గురించే నెటిజన్లు ఎక్కువగా మాట్లాడారు. తమదైన శైలిలో పొగాడారు కూడా. అసలు ఎన్నికలు మొదలైనప్పటినుండీ సాగిన రాజకీయ చర్చల్లో […]
ఇప్పుడు ఒక విషయం గురించి ఎంతమంది ఏమని మాట్లాడుకుంటున్నారు….అనే ప్రశ్నకు కచ్ఛితంగా సరైన సమాధానాన్ని తెలుసుకునే వీలు ఉంది. వందల, వేల గళాలను, అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి తెస్తున్నాయి. నిజానికి వీటిలో కనిపించే కామెంట్లలో ఒక్కోసారి మంచి హాస్య చతురత, సృజనాత్మకత కూడా ఉంటున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పశ్చిమబెంగాల్లో విజయం సాధించిన మమతా దీదీని గురించే నెటిజన్లు ఎక్కువగా మాట్లాడారు. తమదైన శైలిలో పొగాడారు కూడా. అసలు ఎన్నికలు మొదలైనప్పటినుండీ సాగిన రాజకీయ చర్చల్లో కూడా మమతే ముందున్నారని ఒక సర్వే సైతం వెల్లడించింది. సోషల్మీడియాలో ఫిబ్రవరి 12 నుంచి మే 10వ తేదీ వరకు 2.2 కోట్ల మంది ఎన్నికల గురించి చర్చించుకుంటే, అత్యధికంగా బిజెపి గురించి 61శాతం చర్చ జరిగిందని సర్వే వెల్లడించింది. ఇక నేతల విషయానికి వస్తే మమతబెనర్జీ ముందున్నారు. ఆమె గురించి అధికంగా 22శాతం మంది చర్చించుకున్నారు. అంతేకాదు, ఫలితాల తరువాత కూడా సోషల్మీడియాలో మమత హవా నడిచింది.
పశ్చిమ్ బెంగాల్ రాణిగా తిరిగి మమతకే పట్టాభిషేకమని, ఆమె కోల్కతాని లండన్లా మార్చేయాలని కోరుకుంటున్నామనే కామెంట్లు కనిపించాయి. భారతదేశానికి అమ్మ…. అంటే మమతా బెనర్జీనే అనీ, ఆ పోస్టు కోసం సోనియా గాంధీ పోటీ మాత్రమే పడుతుంటారనే విశ్లేషణలూ వచ్చాయి. రూపా గంగూలి మంచి నటనా నైపుణ్యాలు ఉన్న నటి…. ఆమె దీదీలా నటించేందుకు బాగా ప్రయత్నిస్తున్నారని, అయితే మమతను ఎవరూ అనుకరించలేరనే చమత్కారాలకు కూడా సోషల్మీడియా వేదికైంది. వీటితో పాటు బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి శర్వానంద సోనోవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు ముందే ఆయన విద్యార్హతల పట్టాల్ని కేజ్రీవాల్కి చూపించాల్సిందేననే సరదా కామెంట్లు సైతం కనిపించాయి.