పవర్ మంత్రి విజయాలు చెబుతున్నారు...పవర్ పోయింది!
కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయుష్ గోయల్… ఉజ్వల భారతం…రెండేళ్లు…అనే పుస్తకాన్ని ఇలా విడుదల చేశారో లేదో అలా… అక్కడ అంతా చీకట్లు కమ్ముకున్నాయి. ఇదేదో సింబాలిక్గా చెబుతున్నది కాదు, నిజంగానే కరెంటు పోయి లైట్లు ఆరిపోయియి. న్యూఢిల్లీలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం తమ విద్యుత్ శాఖ సాధించిన విజయలను గురించి ఆయన చెబుతున్నారు. అంతలో సడన్గా కరెంట్ పోయింది. అయినా గోయల్ తడబడకుండా జరిగినదాన్ని సైతం తన ప్రసంగంలో కలుపుకుని మాటలు కొనసాగించారు. తన […]
కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయుష్ గోయల్… ఉజ్వల భారతం…రెండేళ్లు…అనే పుస్తకాన్ని ఇలా విడుదల చేశారో లేదో అలా… అక్కడ అంతా చీకట్లు కమ్ముకున్నాయి. ఇదేదో సింబాలిక్గా చెబుతున్నది కాదు, నిజంగానే కరెంటు పోయి లైట్లు ఆరిపోయియి. న్యూఢిల్లీలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం తమ విద్యుత్ శాఖ సాధించిన విజయలను గురించి ఆయన చెబుతున్నారు. అంతలో సడన్గా కరెంట్ పోయింది. అయినా గోయల్ తడబడకుండా జరిగినదాన్ని సైతం తన ప్రసంగంలో కలుపుకుని మాటలు కొనసాగించారు. తన భార్య పవర్కట్ల గురించి చెబుతుంటుందని, తాను చేయాల్సింది ఇంకా చాలా ఉందని కూడా తనకు తెలుసునని ఆయన అన్నారు. ఢిల్లీకి ఒక విద్యుత్ పంపిణీ విధానాన్ని అమలు చేయనున్నట్టుగా చెబుతుండగా తిరిగి కరెంటు వచ్చింది. ముంబయికి అసలు పవర్ కట్ అనేదే లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా పీయూష్ గోయల్ పేర్కొన్నారు.