భర్తమీద అనుమానం...మేనకోడలిని చంపేసింది!
తన భర్తకు, తన అన్నభార్యకు సంబంధం ఉందేమో అనే అనుమానంతో ఒక మహిళ తన అన్న కూతురిని చంపిన ఘటన ఢిల్లీలో జరిగింది. మరణించిన రెండేళ్ల పాప తల్లి దండ్రులు ఫిరోజ్ ఆలం, ఫిర్దోస్. ఫిరోజ్ తన భార్యాపిల్లలతో కలిసి తన చెల్లి రోషన్ (22) ఇంట్లో ఉంటున్నాడు. రోషన్ భర్త అఫ్తాబ్. ఫిరోజ్కి ఒక సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే షాపు ఉంది. ఈ క్రమంలో ఆడవాళ్లు పిర్దోస్కి, రోషన్కి పడేది కాదు. వారిమధ్య ఎప్పుడూ […]
తన భర్తకు, తన అన్నభార్యకు సంబంధం ఉందేమో అనే అనుమానంతో ఒక మహిళ తన అన్న కూతురిని చంపిన ఘటన ఢిల్లీలో జరిగింది. మరణించిన రెండేళ్ల పాప తల్లి దండ్రులు ఫిరోజ్ ఆలం, ఫిర్దోస్. ఫిరోజ్ తన భార్యాపిల్లలతో కలిసి తన చెల్లి రోషన్ (22) ఇంట్లో ఉంటున్నాడు. రోషన్ భర్త అఫ్తాబ్. ఫిరోజ్కి ఒక సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే షాపు ఉంది. ఈ క్రమంలో ఆడవాళ్లు పిర్దోస్కి, రోషన్కి పడేది కాదు. వారిమధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. తన అన్న భార్య ఫిర్డోస్కి, తన భర్త అఫ్తాబ్తో అక్రమ సంబంధం ఉందని రోషన్ అనుమానిస్తుండేది. గత మంగళవారం అలాగే ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అది అయిపోయాక ఆ కోపంతో రోషన్ అన్న కూతురు అసీనాను పిలుచుకుని తన గదిలోకి వెళ్లింది. అక్కడ ఆమె గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. మంచానికి ఉన్న బాక్స్లో పాప శవాన్ని దాచింది. పాపకోసం వెతుక్కున్న తల్లిదండ్రులు చివరికి పోలీస్ రిపోర్టు ఇచ్చారు.
ఈ కేసులో పోలీసులు పాపని వెతకడానికి ఇరవై టీములను ఏర్పాటు చేశారు. రెండు టీములు పాప కోసం ఇల్లంతా వెతుకుతున్న సమయంలో బుధవారం రాత్రి పోలీసులకు రోషన్ గదినుండి దుర్వాసన వచ్చింది. రోషన్ అది కూలర్ నుండి వస్తున్న వాసన అంటూ వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినా పోలీసులు గదంతా వెతికి పాప శవాన్ని పట్టుకున్నారు. పోలీసుల ఇంటరాగేషన్లో రోషన్ తానే హత్యచేసినట్టుగా ఒప్పుకుంది. ఇంతకుముందు కూడా రోషన్ రెండుసార్లు తమ బిడ్డని చంపే ప్రయత్నం చేసిందని పాప తల్లి ఫిర్డోస్ రోదిస్తూ పోలీసులకు తెలిపింది. పోలీసులు రోషన్ మీద హత్యానేరం నమోదు చేసి అరెస్టు చేశారు.