అయ్యో....!
అభం, శుభం తెలియని అయిదేళ్ల చిన్నారిపై 60ఏళ్ల మృగాడు అత్యాచారం చేసిన ఘటన మచిలీపట్నంలో జరిగింది. ఈ సంఘటన మార్చి 31న జరగ్గా, పాపకి చికిత్స చేస్తున్న వైద్యులు ఒప్పించగా తల్లిదండ్రులు పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దాంతో శుక్రవారమే ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నాగేశ్వరరావు స్థానికంగా ఉన్న కోపరేటివ్ సొసైటీలో క్లర్కుగా పనిచేస్తున్నాడు. ఇతను అంగన్వాడీ బడికి వెళ్లివస్తున్న పాపకి మాయ మాటలు చెప్పి లోపలికి తీసుకువెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. పాప ఎంతకీ […]
అభం, శుభం తెలియని అయిదేళ్ల చిన్నారిపై 60ఏళ్ల మృగాడు అత్యాచారం చేసిన ఘటన మచిలీపట్నంలో జరిగింది. ఈ సంఘటన మార్చి 31న జరగ్గా, పాపకి చికిత్స చేస్తున్న వైద్యులు ఒప్పించగా తల్లిదండ్రులు పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దాంతో శుక్రవారమే ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నాగేశ్వరరావు స్థానికంగా ఉన్న కోపరేటివ్ సొసైటీలో క్లర్కుగా పనిచేస్తున్నాడు. ఇతను అంగన్వాడీ బడికి వెళ్లివస్తున్న పాపకి మాయ మాటలు చెప్పి లోపలికి తీసుకువెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. పాప ఎంతకీ రాకపోవడంతో ఆమె తాత వెతుకుతూ వచ్చాడు. నాగేశ్వరరావు ఇంట్లోంచి పాప అరుపులు వినిపించడంతో తలుపులను బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. చిన్నారి అప్పటికే రక్తమోడుతూ కనిపించింది. పాపకి తొలుత మచిలీ పట్నంలో చికిత్స చేయించి అనంతరం, వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకువెళ్లారు.
చిన్నారి విపరీతమైన జ్వరం, రక్తస్రావం, మూత్రాశయం సమస్యలతో చిత్ర వధ అనుభవించి… చికిత్స పొందుతోంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులే పాప తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వారు పోలీసులకు ఫిర్యాదు చేసేలా చేశారు. పోలీసులు నాగేశ్వరరావుని అరెస్టు చేశారు. అతనిపై చిన్నపిల్లలకు లైంగిక నేరాలనుండి రక్షణ కల్పించే చట్టంతో పాటు సెక్షన్ 376ని నమోదు చేశారు.