స్పోర్ట్స్ కారుని దర్జాగా కాజేశాడు!
ఎలాంటి కష్టం, శ్రమ లేకుండా ఓ దొంగ స్పోర్ట్స్ కారుని దొంగిలించిన సంఘటన ముంబయిలో జరిగింది. పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారం చెన్నైకి చెందిన మావవ్ దీప్ సింగ్ వ్యాపారవేత్త. ఆయన తన భార్యాపిల్లలతో కలిసి విహార యాత్రకోసం ముంబయి వచ్చాడు. ముంబయిలో ఎయిర్పోర్టులో దిగిన తరువాత తన స్నేహితుడు కుల్వంత్ సింగ్ నుండి టయోటా ఫార్చ్యునర్ కారుని తీసుకుని ఆర్కిడ్ హోటల్కి వెళ్లాడు. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో కారుని హోటల్లో పార్కింగ్ ప్లేస్లో పార్క్చేసి […]
ఎలాంటి కష్టం, శ్రమ లేకుండా ఓ దొంగ స్పోర్ట్స్ కారుని దొంగిలించిన సంఘటన ముంబయిలో జరిగింది. పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారం చెన్నైకి చెందిన మావవ్ దీప్ సింగ్ వ్యాపారవేత్త. ఆయన తన భార్యాపిల్లలతో కలిసి విహార యాత్రకోసం ముంబయి వచ్చాడు. ముంబయిలో ఎయిర్పోర్టులో దిగిన తరువాత తన స్నేహితుడు కుల్వంత్ సింగ్ నుండి టయోటా ఫార్చ్యునర్ కారుని తీసుకుని ఆర్కిడ్ హోటల్కి వెళ్లాడు. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో కారుని హోటల్లో పార్కింగ్ ప్లేస్లో పార్క్చేసి తాళంని వాలెట్కి అప్పగించాడు. తరువాత అతను రాత్రి తొమ్మిది గంటలకు కారు కోసం వచ్చి చూస్తే అది కనిపించలేదు. వెంటనే ఈ విషయాన్ని హోటల్ మేనేజ్మెంట్కి, కుల్వంత్ సింగ్కి చెప్పాడు. హోటల్ సిబ్బంది సిసిటివి ఫుటేజిని పరిశీలించగా ఆకుపచ్చ షర్టు వేసుకున్న ఒక వ్యక్తి మధ్యాహ్నం పన్నెండున్నర ప్రాంతంలో, తాళాలు ఉంచిన వాలెట్ ప్రాంతంలో ఎవరూ లేకపోవటం గమనించి, టయోటా కారు తాళాలు తీసుకుని దాన్ని వేసుకుని వెళ్లిపోవటం కనిపించింది.
మానవ్, కుల్వంత్తో పాటు హోటల్ యాజమాన్యం కూడా పోలీసు కంప్లయింట్ ఇచ్చారు. కారుని దొంగలించిన వ్యక్తి సిసిటివి ఫుటేజిలో స్పష్టంగా కనిపించడంతో తమ క్రిమినల్ రికార్డుల్లో అతని గురించి వెతుకుతామని పోలీసులు వెల్లడించారు. కారు దొంగతనం జరగడానికి కారణం తమ నిర్లక్ష్యమేనని హోటల్ అథారిటీ మావవ్ దీప్ సింగ్కి లేఖ రాసి ఇచ్చింది. కారుని వెతకటంలో పూర్తిగా సహకరిస్తామని హోటల్ జనరల్ మేనేజర్ పోలీసులకు తెలిపారు. పశ్చిమ ముంబయి శివారు ప్రాంతాల్లో ఇలాంటి కారు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.