రాసలీలల బాబా...ఊచల వెనక్కు!
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న బాబా పరమానందను పోలీసులు మంగళవారం మధ్యప్రదేశ్లోని సాత్నాలో అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్లోని బారబంకిలో ఉన్న తన ఆశ్రమంలో బాబా చేసిన రాసలీలలు, మహిళలపై పాల్పడిన లైంగిక వేధింపులు బయటకు రావటంతో 15 రోజులుగా ఆయన పరారీలో ఉన్నాడు. సంతానంలేని మహిళలకు సంతానం కలిగేలా చేస్తానంటూ నమ్మించి వారిపై లైగింక దాడులకు పాల్పడినట్టుగా పరమానందపై ఆరోపణలు ఉన్నాయి. మహిళలను వేధించడమే కాకుండా, ఆ దారుణాలను వీడియోల్లోకి […]
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న బాబా పరమానందను పోలీసులు మంగళవారం మధ్యప్రదేశ్లోని సాత్నాలో అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్లోని బారబంకిలో ఉన్న తన ఆశ్రమంలో బాబా చేసిన రాసలీలలు, మహిళలపై పాల్పడిన లైంగిక వేధింపులు బయటకు రావటంతో 15 రోజులుగా ఆయన పరారీలో ఉన్నాడు. సంతానంలేని మహిళలకు సంతానం కలిగేలా చేస్తానంటూ నమ్మించి వారిపై లైగింక దాడులకు పాల్పడినట్టుగా పరమానందపై ఆరోపణలు ఉన్నాయి. మహిళలను వేధించడమే కాకుండా, ఆ దారుణాలను వీడియోల్లోకి ఎక్కించి బాధితులను బ్లాక్మెయిల్ చేశాడని పోలీసులు తెలిపారు. బాబా పరమానంద అసలు పేరు రాం శంకర్ తివారి. 30 సంవత్సరాల క్రితం బారబంకిలో ఆశ్రమం ఏర్పాటు చేశాడు. సంతాన ప్రాప్తి కలిగిస్తాను…మగపిల్లలు కలిగేలా అనుగ్రహిస్తాను…అంటూ ప్రచారం చేస్తూ మహిళలను ఆకట్టుకునేవాడు. అలా నమ్మి తనవద్దకు వచ్చిన మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసేవాడని పోలీసులు వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని సాత్నాలో అరెస్టయిన అతడిని పోలీసులు బారబంకికి తీసుకువచ్చారు.
అతని ఆశ్రమంలో తీసిన ఒక వీడియో క్లిప్పింగ్ని ఒక బాధితురాలు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో బాబా గుట్టు రట్టయింది. దాంతో ఇప్పుడు బాబా చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేశారు. అంతేకాదు, పరమానంద మాజీ డ్రైవర్ సుశీల్ అవాస్తీ బాబాపై థానేలో కేసు పెట్టాడు. మహిళలను బ్లాక్మెయిల్ చేయడంలో పరమానంద కుమారుడు, భార్య అతడికి సహాయపడేవారని సుశీల్ ఆరోపించాడు. బాబా ఆశ్రమంలో పోలీసులు సోదాలు చేయగా అసభ్యకరమైన వీడియోలు చాలా దొరికాయి.