ఓ సెల్ఫీ...సైబర్ క్రైమ్కి బలి చేయొచ్చు!
ఇది సెల్ఫీల కాలం. మనిషిలో ప్రదర్శనా స్వభావం ఏ స్థాయిలో ఉంటుందో ఫేస్బుక్, సెల్ఫీలు వచ్చాక మరింత స్పష్టంగా తెలుస్తోంది. అయితే అన్ని సెల్ఫీలు ఆనందాన్నే ఇవ్వవు. కొన్ని చేదు అనుభవాలుగా మిగిలే ప్రమాదం ఉందని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతా బాగున్నపుడు సన్నిహితంగా దిగిన సెల్ఫీలను, వంచకులు బ్లాక్మెయిల్కి వాడుకునే ప్రమాదం ఉందంటున్నారు వారు. హైదరాబాద్, సఫిల్గూడకు చెందిన నిజాముద్దీన్ హైదర్(32)కి ఒక ఎంబిఎ విద్యార్థిని ఒక జాబ్ ఇంటర్వ్యూలో పరిచయమైంది. పరిచయం […]
ఇది సెల్ఫీల కాలం. మనిషిలో ప్రదర్శనా స్వభావం ఏ స్థాయిలో ఉంటుందో ఫేస్బుక్, సెల్ఫీలు వచ్చాక మరింత స్పష్టంగా తెలుస్తోంది. అయితే అన్ని సెల్ఫీలు ఆనందాన్నే ఇవ్వవు. కొన్ని చేదు అనుభవాలుగా మిగిలే ప్రమాదం ఉందని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతా బాగున్నపుడు సన్నిహితంగా దిగిన సెల్ఫీలను, వంచకులు బ్లాక్మెయిల్కి వాడుకునే ప్రమాదం ఉందంటున్నారు వారు. హైదరాబాద్, సఫిల్గూడకు చెందిన నిజాముద్దీన్ హైదర్(32)కి ఒక ఎంబిఎ విద్యార్థిని ఒక జాబ్ ఇంటర్వ్యూలో పరిచయమైంది. పరిచయం మరికాస్త ముందుకెళ్లాక ఆ సాన్నిహిత్యాన్ని వారు సెల్ఫీల్లో బంధించడం మొదలుపెట్టారు. నిజాముద్దీన్ తాను అనాథనని ఆమెకు చెప్పాడు. ఆమెని పెళ్లి చేసుకుంటానన్నాడు. అయితే తరువాత ఆమెకు అతని నిజస్వరూపం తెలిసింది.
అతనికి పెళ్లయిందని తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ఇకపై అతనికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. కానీ అందుకు అతను ఒప్పుకోలేదు. తాము సన్నిహితంగా ఉన్నపుడు తీసుకున్నసెల్ఫీలను నెట్లో పెడతానంటూ ఆమెని బ్లాక్మెయిల్ చేయటం ప్రారంభించాడు. దాంతో ఆ అమ్మాయి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన మరొక కేసులో 21 సంవత్సరాల ఇంజినీరింగ్ విద్యార్థి అబ్దుల్ మజీద్ ఫేస్బుక్లో అమ్మాయి పేరుతో అమ్మాయిలను పరిచయం చేసుకునేవాడు. వారితో స్నేహం పెంచుకునేవాడు. వారు ఇతరులతో షేర్ చేసుకోలేని రహస్యాలను అడిగి తెలుసుకునేవాడు. వారు… అతను అమ్మాయే అనే నమ్మకంతో వారి అర్థనగ్న ఫొటోలను సైతం షేర్ చేసేవారు. తరువాత తన నిజస్వరూపం బయటపెట్టేవాడు. డబ్బు ఇవ్వాలని, ఇవ్వకపోతే ఫొటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఇలా అతను పదుల సంఖ్యలో అమ్మాయిలను మోసం చేశాడు. ఇతడిని సిటీలోని రెండు కమిషనరేట్ల పరిధిలో ఏడునెలల్లో రెండుసార్లు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరవుతున్నవారే బ్లాక్మెయిలర్స్గా మారుతున్న సంఘటనలు పెరుగుతున్నాయని, ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.