...రమ్య ఎలా చనిపోయింది?!
కన్నకూతురు సుఖపడుతుందని కోట్లు ఖర్చుపెట్టి ఎన్నారై సంబంధాలు చేస్తున్న తల్లిదండ్రులకు చివరికి కడుపుకోత మిగులుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియా నుండి ఉదయం తల్లిదండ్రులతో మాట్లాడిన రమ్య అనే యువతి మధ్యాహ్నానికల్లా మరణించిన ఉదంతం ఇటీవల జరిగింది. కుకట్పల్లి కెపిహెచ్బికి చెందిన రమ్యకృష్ణకు వరంగల్ జిల్లాకు చెందిన మహంత్తో 2014లో వివాహం జరిగింది. ఇటీవల అక్కడ వారు ఇల్లుకూడా కట్టుకున్నారు. అంతా బాగానే ఉంది…అనుకుంటున్న రమ్య కుటుంబ సభ్యులకు పెను ఘాతంలా ఆమె మృతివార్త తెలిసింది. మహంత్ స్నేహితుడు […]
కన్నకూతురు సుఖపడుతుందని కోట్లు ఖర్చుపెట్టి ఎన్నారై సంబంధాలు చేస్తున్న తల్లిదండ్రులకు చివరికి కడుపుకోత మిగులుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియా నుండి ఉదయం తల్లిదండ్రులతో మాట్లాడిన రమ్య అనే యువతి మధ్యాహ్నానికల్లా మరణించిన ఉదంతం ఇటీవల జరిగింది. కుకట్పల్లి కెపిహెచ్బికి చెందిన రమ్యకృష్ణకు వరంగల్ జిల్లాకు చెందిన మహంత్తో 2014లో వివాహం జరిగింది. ఇటీవల అక్కడ వారు ఇల్లుకూడా కట్టుకున్నారు. అంతా బాగానే ఉంది…అనుకుంటున్న రమ్య కుటుంబ సభ్యులకు పెను ఘాతంలా ఆమె మృతివార్త తెలిసింది. మహంత్ స్నేహితుడు ఈ నెల 17న ఫోన్చేసి రమ్య మరణ వార్తని తమకు చెప్పాడని ఆమె బంధువులు చెబుతున్నారు. ఆ ఉదయమే రమ్య తమతో ఫోన్లో మాట్లాడిందని, ఉదయం మాట్లాడిన అమ్మాయి, మధ్యాహ్నానికి ఎలా చనిపోతుందని ఆమె తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రమ్యని ఆమె భర్తే హతమార్చాడని వారు ఆరోపిస్తున్నారు.
రమ్య పట్ల అత్తింటివారు పూర్తి పక్షపాతం చూపేవారని, చిన్న కొడుకు పెళ్లయ్యాక, పెద్ద కొడుకు కోడలు మహంత్ రమ్యల ఫొటోలను సైతం వారు ఇంట్లో గోడలమీద నుండి తీసేశారని, ఆమె పట్ల వారికి ఎలాంటి ప్రేమ లేదని రమ్య బంధువులు చెబుతున్నారు. ఇల్లు కట్టుకున్నాక ఆస్ట్రేలియా వెళ్లిన రమ్య అత్తగారు, ఆ ఇంటిని తన పేరుమీద పెట్టమని పోరుపెట్టిందని, ఈ క్రమంలోనే రమ్యని వారు చంపేశారని రమ్య బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగాలని, రమ్య తాలూకూ వస్తువులు అన్నీ తమకు చేరాలని వారు కోరుతున్నారు. రమ్య బాడీని తమకు ఇవ్వరేమో అనే భయంతోనే ఇన్నాళ్లూ తాము మాట్లాడలేదని వారంటున్నారు. రమ్య పేరు మీద రూ. 2.5 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఉందని, ఆ డబ్బుకోసమే ఆమెని చంపేశారని ఆమె తరపువారు చెబుతుండగా, రమ్య అత్తింటివారి వాదన వేరుగా ఉంది. ఇల్లు కట్టుకునే విషయంలో భార్యాభర్తలకు మధ్య గొడవలు ఉన్నాయని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని వారు చెబుతున్నారు. రమ్య చనిపోయిందన్న దుఃఖంతో ఆస్ట్రేలియా చేరిన ఆమె బంధువులు అనేక ఇబ్బందులు పడి శుక్రవారం రాత్రికి ఆమె మృతదేహాన్ని హైదరాబాద్కి తీసుకువచ్చారు. రమ్య మెడకు తాడులాంటిది బిగుసుకుపోవటం వల్లనే ఆమె మరణించిందని ఆస్ట్రేలియా వైద్యులు పోస్ట్ మార్టం నివేదికను ఇచ్చారు. రమ్య బంధువులతో పాటు ఇండియా వచ్చిన మహంత్, ఆమె పాస్పోర్టు తీసుకుని అక్కడినుండి పరారయ్యాడని రమ్య తరపువారు ఆరోపిస్తున్నారు. ఇరు కుటుంబాలవారు ఒకరిపై ఒకరు నేరారోపణలు చేసుకుంటున్న క్రమంలో రమ్య మరణం వెనుక ఉన్న అసలు కారణం, నిజానిజాలు తెలియాల్సి ఉంది.