ఆ వీడియోని గూగుల్, యూట్యూబ్లు ఆపుతాయా?
అడల్డ్ ఇండియన్ కామెడీ గ్రూపు ఎఐబి సృష్టించిన తాజా వీడియో వారికి పెద్ద చిక్కునే తెచ్చేలా ఉంది. తన్మయ్ భట్ తన సహజ ధోరణిలో సెలబ్రిటీలను ఆధారం చేసుకుని సృష్టించే కామెడీ వీడియోల్లో భాగంగా… లతా మంగేష్కర్, సచిన్ టెండుల్కర్లతో తాజా వీడియోని రూపొందించాడు. ఇప్పటికే తన్మయ్ భట్ హాస్యం పేరుతో తమపై తీసిన వీడియోలపై కక్కలేక మింగలేక అవస్థలు పడుతున్న సెలబ్రిటీలకు ఊరట నిచ్చేలా… ఈ తాజా వీడియోమీద నిరసనలు దుమారంలా లేచాయి. మహారాష్ట్ర అధికారపార్టీ […]
అడల్డ్ ఇండియన్ కామెడీ గ్రూపు ఎఐబి సృష్టించిన తాజా వీడియో వారికి పెద్ద చిక్కునే తెచ్చేలా ఉంది. తన్మయ్ భట్ తన సహజ ధోరణిలో సెలబ్రిటీలను ఆధారం చేసుకుని సృష్టించే కామెడీ వీడియోల్లో భాగంగా… లతా మంగేష్కర్, సచిన్ టెండుల్కర్లతో తాజా వీడియోని రూపొందించాడు. ఇప్పటికే తన్మయ్ భట్ హాస్యం పేరుతో తమపై తీసిన వీడియోలపై కక్కలేక మింగలేక అవస్థలు పడుతున్న సెలబ్రిటీలకు ఊరట నిచ్చేలా… ఈ తాజా వీడియోమీద నిరసనలు దుమారంలా లేచాయి. మహారాష్ట్ర అధికారపార్టీ బిజెపితో పాటు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నాయకులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసు అధికారులు ఇప్పుడు ఆ వీడియోని ఆపే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.
ప్రస్తుతం దీనిపై న్యాయ సలహా తీసుకుంటున్నామని, తరువాత గూగుల్, యూట్యుబ్ల్లో దీన్ని నిషేధించేందుకు ఆయా సంస్థల ప్రతినిధులను సంప్రదిస్తామని వారు తెలిపారు. సచిన్ వర్సెస్ లతా సివిల్ వార్ పేరుతో దీన్ని ఈ నెల 26న ఫేస్బుక్, స్నాప్ ఛాట్ల్లో పోస్ట్ చేశారు. సచిన్, విరాట్ కోహ్లీ వీరిద్దరిలో ఎవరు మంచి క్రికెటర్ అనే విషయం మీద లతకు సచిన్కు మధ్య జరిగే వాదోపవాద డైలాగులను వారి ముఖ చిత్రాల ద్వారానే పలికించారు. ఈ వీడియో ఆదివారానికి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది. దీన్ని నెటిజన్లు హాస్యంగా తీసుకోలేకపోయారు. ఇది తీవ్రమైన విమర్శలకు గురయింది. సాధారణ ప్రజలతో పాటు బాలివుడ్ తారలు సైతం దీనిపై చాలా ఘాటుగా స్పందించారు. ఇది కామెడీ కాదని, వ్యక్తులను కించపరచడమేననే విమర్శలు తీవ్రం కావటంతో పాటు రాజకీయ పార్టీలు సైతం కల్పించుకోవడంతో పోలీసులు దీన్ని నిలిపివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.