గదిలో పెట్టి మోసం చేశారు-బాబుపై పుష్పరాజ్ ఫైర్
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ నేత పుష్పరాజు భగ్గుమన్నారు. పుష్పరాజ్కు రాజ్యసభ సీటు ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా ఆ అవకాశం టీజీ వెంకటేష్కు కట్టబెట్టారు. టీజీకి పదవి దక్కడం వెనుక చినబాబు హస్తముందని, భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్పరాజ్ తీవ్రంగా స్పందించారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. పదవుల విషయంలో తనను పదేపదే మోసం చేస్తున్నారని మండిపడ్డారు. […]
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ నేత పుష్పరాజు భగ్గుమన్నారు. పుష్పరాజ్కు రాజ్యసభ సీటు ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా ఆ అవకాశం టీజీ వెంకటేష్కు కట్టబెట్టారు. టీజీకి పదవి దక్కడం వెనుక చినబాబు హస్తముందని, భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్పరాజ్ తీవ్రంగా స్పందించారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. పదవుల విషయంలో తనను పదేపదే మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తనను గదిలో పెట్టి మొత్తం వ్యవహారం నడిపేశారని ఆవేదన చెందారు. ఎన్టీఆర్ నాటి టీడీపికి ఇప్పటి టీడీపీకి పొంతనే లేదన్నారు. నిజాయితీకి టీడీపీలో చోటు లేదనిపిస్తోందని పుష్పరాజ్ ఆవేదన చెందారు. తొలి నుంచి రాజ్యసభ రేసులో దళితుడైన పుష్పరాజ్కు అవకాశం ఖాయమనుకున్నారు. కానీ హఠాత్తుగా టీజీకి సీటు కేటాయించడంపై టీడీపీ నేతలు కూడా అవాక్కయ్యారు.
Click on Image to Read: