ఇద్దరిని చంపి, ఆత్మహత్య చేసుకున్న మాజీ పిహెచ్డి విద్యార్థి... పిల్లిని కాపాడమన్నాడు!
పిహెచ్డి చేయడంలో తనకు గైడ్గా వ్యవహరించిన ప్రొఫెసర్ని కాల్చి చంపాడు ఓ మాజీ పిహెచ్డి విద్యార్థి. భారతీయుడైన ఈ వ్యక్తి పేరు మైనక్ సర్కార్ (38). యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ (యుసిఎల్ఎ)లో పిహెచ్డి చేస్తూ ఆపేసిన సర్కార్, తన ప్రొఫెసర్ విలియం క్లగ్ (39) ని కాల్చి చంపాడు. అనంతరం తననుతాను కాల్చుకుని మరణించాడు. క్యాంపస్లోని ఇంజినీరింగ్ బిల్డింగ్లోనే అతను హత్యకు, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ప్రదేశంలో అతను తన ఇంటి అడ్రస్ని తెలుపుతూ […]
పిహెచ్డి చేయడంలో తనకు గైడ్గా వ్యవహరించిన ప్రొఫెసర్ని కాల్చి చంపాడు ఓ మాజీ పిహెచ్డి విద్యార్థి. భారతీయుడైన ఈ వ్యక్తి పేరు మైనక్ సర్కార్ (38). యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ (యుసిఎల్ఎ)లో పిహెచ్డి చేస్తూ ఆపేసిన సర్కార్, తన ప్రొఫెసర్ విలియం క్లగ్ (39) ని కాల్చి చంపాడు. అనంతరం తననుతాను కాల్చుకుని మరణించాడు. క్యాంపస్లోని ఇంజినీరింగ్ బిల్డింగ్లోనే అతను హత్యకు, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ప్రదేశంలో అతను తన ఇంటి అడ్రస్ని తెలుపుతూ ఒక లేఖని ఉంచాడు. అందులో తన పిల్లికి తగిన వసతి కల్పించాలని కోరాడు. సర్కార్ తెలిపిన అడ్రస్కు చేరిన పోలీసులకు అతని ఇంట్లో … చంపాల్సిన వారి లిస్టుగా పేర్కొన్న… ముగ్గురి పేర్లతో ఉన్న పేపరు దొరికింది. అందులో ఒక పేరు క్లగ్ది కాగా, మరొక పేరు మరొక ప్రొఫెసర్ది. ఆ రోజు ఆ ప్రొఫెసర్ యూనివర్శిటీకి రాకపోవడం వలన అతను సర్కార్కి దొరకలేదని పోలీసులు గుర్తించారు. లిస్టులో ఉన్న మూడో పేరు అతని మాజీ గర్ల్ ప్రెండ్ హస్తీగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మిన్నెసోటాలో అంతకుముందు రోజు తన ఇంట్లోనే తుపాకి కాల్పుల్లో మరణించిన యువతిని… సర్కార్ మాజీ భార్య హస్తీగా పోలీసులు భావిస్తున్నారు. ఆ చుట్టుపక్కలవారు సర్కార్, హస్తీ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరగటం గమనించినట్టుగా తెలిపారు. లాస్ ఏంజిల్స్ పోలీసులు సర్కార్ హత్యలు చేసి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా గురువారం నిర్దారించారు.
సర్కార్ ఇండియా, ఖాన్పూర్లో ఏరో స్పేస్ ఇంజినీరింగ్లో డిగ్రీ చేశాడు. తరువాత అమెరికా స్టాన్ఫర్డ్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. 2006లో పిహెచ్డి మొదలుపెట్టిన అతను పదేళ్లు గడిచినా పిహెచ్డి పూర్తి చేయలేకపోయాడు. అందుకు కారణం తన ప్రొఫెసరే అనే కోపం సర్కార్లో ఉందని అతని సోషల్ మీడియా పోస్టింగ్స్ వలన తెలుస్తోంది. అంతేకాదు, ప్రొఫెసర్ క్లగ్ తన కంప్యూటర్ కోడ్లను కాజేసి ఇతర విద్యార్థులకు ఇవ్వటం వల్లనే తాను పిహెచ్డి పూర్తి చేయలేకపోయానని సర్కార్ ఆరోపించాడు. అయితే పిహెచ్డి పరంగా తన ఆలోచనలు ఇతరులకు చేరుతున్నాయని అతను అపోహపడ్డాడని, ఇది ఒక మానసిక జాడ్యం అని అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. ఒక మంచి ప్రోఫెసర్ని కోల్పోయామని యూనివర్శిటీ అధికారులు తమ ఆవేద న ని వ్యక్తం చేశారు.