స్వచ్ఛభారత్ పేరుతో...హత్యచేశాడు!
ప్రధాని నరేంద్ర మోడీ అభిమాన పథకం స్వచ్ఛభారత్ని అడ్డుపెట్టుకుని ఓ వ్యక్తి ఎవరికీ అనుమానం రాకుండా తన భార్యని హతమార్చాడు. ఛాంద్మాల్ జైన్ అనే వ్యక్తి రాజస్థాన్లోని రాజస్మంధ్ జిల్లా, మాజెరాగాన్ ప్రాంతంలో కిరాణా షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. అతని భార్య సరిత. ఒక బిడ్డకు జన్మనిచ్చాక ఆమె అనారోగ్యం పాలైంది. బిడ్డ సైతం మరణించగా, సరిత పూర్తిగా మంచం దిగలేని పరిస్థితికి చేరింది. సరితని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న జైన్, స్వచ్ఛభారత్ పేరుతో ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. […]
ప్రధాని నరేంద్ర మోడీ అభిమాన పథకం స్వచ్ఛభారత్ని అడ్డుపెట్టుకుని ఓ వ్యక్తి ఎవరికీ అనుమానం రాకుండా తన భార్యని హతమార్చాడు. ఛాంద్మాల్ జైన్ అనే వ్యక్తి రాజస్థాన్లోని రాజస్మంధ్ జిల్లా, మాజెరాగాన్ ప్రాంతంలో కిరాణా షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. అతని భార్య సరిత. ఒక బిడ్డకు జన్మనిచ్చాక ఆమె అనారోగ్యం పాలైంది. బిడ్డ సైతం మరణించగా, సరిత పూర్తిగా మంచం దిగలేని పరిస్థితికి చేరింది. సరితని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న జైన్, స్వచ్ఛభారత్ పేరుతో ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అప్పటికే ఆ పట్టణంలో చాలామంది స్వచ్ఛభారత్ ప్రేరణతో టాయ్లెట్లు నిర్మించుకుంటున్నారు. అలాగే జైన్ కూడా టాయ్లెట్ నిర్మాణం మొదలుపెట్టాడు. కొంతమంది లేబర్ని పెట్టుకుని టాయ్లెట్ కోసమంటూ గొయ్యిని తవ్వించి, వారు గొయ్యితీసి వెళ్లగానే సరితని ప్రాణంతో ఉండగానే అందులో వేసి పూడ్చేశాడు.
తరువాత రోజు, తాను డబ్బు సమకూర్చుకున్నాక టాయ్లెట్ కట్టించుకుంటానని పనివారికి చెప్పారు. ఇది ఏప్రిల్లో జరిగింది. తరువాత అతను ప్రతిరోజు ఆమెని పూడ్చిపెట్టిన చోటే చాప వేసుకుని నిద్రపోయేవాడు. సరిత కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారు అతడిని ఆమె గురించి అడగ్గా, పుట్టింటికి వెళ్లిందని వారితో చెప్పాడు. జైన్ సొంత అన్న సైతం అతని మాటని నమ్మాడు.
చివరికి సరిత ఎక్కడా లేదని అందరికీ తెలిసిపోవడంతో, ఆమె 5వేల రూపాయలు తీసుకుని ఇంట్లోంచి పారిపోయిందంటూ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు. జైన్ చెబుతున్న అతుకుల బొంతలాంటి మాటలు, చుట్టుపక్కలవారి నుండి సేకరించిన సమాచారంతో అనుమానం వచ్చిన పోలీసులు…అతని ఇంటిని వెతికి… అతను పూడ్చిపెట్టిన చోట నుండి సరిత శవాన్ని బయటకు తీశారు. బంధువుల ఇంట్లో దాక్కున్న జైన్ని అరెస్టు చేసి అతనిపై హత్యానేరం నమోదు చేశారు.