గర్ల్ఫ్రెండ్ కోసం దొంగగా మారిన టెక్కీ!
చెన్నైలో ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన గర్ల్ప్రెండ్కి బహుమతులను కొనివ్వడం కోసం ఏకంగా దొంగతనానికి పాల్పడ్డాడు. కార్తికేయర్ అనే 24 ఏళ్ల టెక్కీ దొంగ…తీరిగ్గా గాంధీ మండపం అనే ప్రాంతంలో ఉన్న బస్ స్టాప్ వద్ద తన బండిని ఆపి, బస్ స్టాప్లో నిలబడి ఉన్న ఒక మహిళ వద్దకు వచ్చాడు. ఆమెను ఏదో అడ్రస్ అడుగుతూ మాట కలిపాడు. తరువాత హఠాత్తుగా ఆమె మెళ్లోని చైన్ లాక్కుని పరిగెత్తుకుని వెళ్లి, తన బండిని స్టార్ట్ చేయబోయాడు. […]
చెన్నైలో ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన గర్ల్ప్రెండ్కి బహుమతులను కొనివ్వడం కోసం ఏకంగా దొంగతనానికి పాల్పడ్డాడు. కార్తికేయర్ అనే 24 ఏళ్ల టెక్కీ దొంగ…తీరిగ్గా గాంధీ మండపం అనే ప్రాంతంలో ఉన్న బస్ స్టాప్ వద్ద తన బండిని ఆపి, బస్ స్టాప్లో నిలబడి ఉన్న ఒక మహిళ వద్దకు వచ్చాడు. ఆమెను ఏదో అడ్రస్ అడుగుతూ మాట కలిపాడు. తరువాత హఠాత్తుగా ఆమె మెళ్లోని చైన్ లాక్కుని పరిగెత్తుకుని వెళ్లి, తన బండిని స్టార్ట్ చేయబోయాడు. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా బండి కదలలేదు. ఈ లోపల ఆ మహిళ కేకలు వేయటం మొదలుపెట్టింది. ఎలాగైతేనే బండి స్టార్ట్ చేసుకుని కాస్త ముందుకు వెళ్లిన కార్తికేయన్, అక్కడే ఉన్న పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. తీరా పోలీసులు అతడి వద్ద ఉన్న గొలుసుని తీసుకుని చూస్తే…అది బంగారం కాదు, రోల్డ్గోల్డని తేలింది. తన గర్ల్ ప్రెండ్ కోరికలు తీర్చడానికే తాను ఈ దొంగతనానికి పాల్పడ్డానని కార్తికేయన్ చెప్పాడు.
అప్పటికే బర్త్ డే సందర్భంగా తన గర్ల్ప్రెండ్కి ఖరీదైన సెల్ఫోన్, డ్రస్లు కొన్నా, ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయని అందుకే ఈ పనిచేశానని పోలీసులకు తెలిపాడు. తన సంపాదన బాగానే ఉన్నా, డబ్బు సరిపోవటం లేదని వాపోయాడు. కార్తికేయన్ నుండి బండిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతను ఇంకా ఏమైనా నేరాలు చేశాడా…అనే విషయాన్ని విచారిస్తున్నారు.