డిప్రెషన్తో ఆసుపత్రిలో చేరితే... అత్యాచారం!
డిప్రెషన్కి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన 22ఏళ్ల వివాహిత యువతికి… ఆమె తిరిగి కోలుకోలేని విధంగా మరింత అన్యాయం జరిగింది. హర్యానా, మేవాట్ జిల్లాలోని ఎస్హెచ్కెఎమ్ ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డిప్రెషన్కి చికిత్స పొందుతున్నయువతిపై వార్డు బాయ్, సెక్యురిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో ఐదవ అంతస్తులో మహిళల జనరల్ వార్డులో ఉన్న యువతిని సోమవారం రాత్రి 11.30గం.ల సమయంలో వార్డు బాయ్, ఆమె తరపు వారు పిలుస్తున్నారంటూ రమ్మని పిలిచాడు. […]
డిప్రెషన్కి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన 22ఏళ్ల వివాహిత యువతికి… ఆమె తిరిగి కోలుకోలేని విధంగా మరింత అన్యాయం జరిగింది. హర్యానా, మేవాట్ జిల్లాలోని ఎస్హెచ్కెఎమ్ ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డిప్రెషన్కి చికిత్స పొందుతున్నయువతిపై వార్డు బాయ్, సెక్యురిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో ఐదవ అంతస్తులో మహిళల జనరల్ వార్డులో ఉన్న యువతిని సోమవారం రాత్రి 11.30గం.ల సమయంలో వార్డు బాయ్, ఆమె తరపు వారు పిలుస్తున్నారంటూ రమ్మని పిలిచాడు. తన బంధువులు వేచి ఉన్న ప్రదేశానికి నడుస్తున్న ఆమెను, వార్డు బాయి బలవంతంగా ఖాళీగా ఉన్న ఒక గదిలోపలికి లాగాడు. అప్పటికే ఆ సమీపంలో ఉన్న సెక్యురిటీ గార్డు కూడా గదిలోకి వెళ్లాడు. యువతి కేకలు వేయకుండా ఆమె నోటిని బంధించారు. దాదాపు రెండు గంటల పాటు ఆమెని హింసించారు.
ఈ లోపల ఆమె బావ యువతికోసం లోపలికి వచ్చి చూసి ఆమె అక్కడ లేకపోవటంతో ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేశాడు. సిబ్బంది కేకలతో వార్డుబాయి, గార్డు గదిలోంచి పారిపోయారు. విషయం బయటపడిన వెంటనే ఆసుప్రతి వర్గాలు రాత్రి ఒంటిగంట సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల్లో ఒకడైన వార్డు బాయి ఆ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాడు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి, వారి కోసం గాలిస్తున్నారు. అక్క బావ దగ్గర ఉన్న తన బాబు ఏడుస్తున్నాడని, వారు తనని పిలుస్తున్నారని చెప్పడంతో, మహిళల జనరల్ వార్డులో ఉన్న తాను బయటకు వచ్చానని బాధితురాలు పేర్కొంది.