ఓ సెల్ఫీ...హంతకుడిని పట్టించింది!
ఏడేళ్ల క్రితం భార్యను హతమార్చి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ హంతకుడు, సెల్ఫీ ద్వారా తనకుతానుగా పట్టుపడ్డాడు. వివరాల్లోకి వెళితే మణి (45), అతని భార్య ఇద్దరూ తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఉండేవారు. మణికి తన భార్యపై అనుమానం ఉంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఆగస్టు, 2009లో ఇలాగే ఒక రోజు గొడవ ముదిరి… మణి ఆవేశంతో తన భార్యని గొంతు కోసి చంపేశాడు. అక్కడి నుండి తప్పించుకుని పరారయ్యాడు. అప్పటినుండి […]
ఏడేళ్ల క్రితం భార్యను హతమార్చి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ హంతకుడు, సెల్ఫీ ద్వారా తనకుతానుగా పట్టుపడ్డాడు. వివరాల్లోకి వెళితే మణి (45), అతని భార్య ఇద్దరూ తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఉండేవారు. మణికి తన భార్యపై అనుమానం ఉంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఆగస్టు, 2009లో ఇలాగే ఒక రోజు గొడవ ముదిరి… మణి ఆవేశంతో తన భార్యని గొంతు కోసి చంపేశాడు. అక్కడి నుండి తప్పించుకుని పరారయ్యాడు. అప్పటినుండి పోలీసులు అతని జాడకోసం వెతుకుతున్నా కనుక్కోలేకపోయారు. అయితే మణి చెన్నై వెళ్లిపోయి కందస్వామి అనే పేరుతో హోటళ్లలో సర్వర్గా పనిచేస్తూ కొత్త జీవితం మొదలుపెట్టాడు. మణి తల్లిదండ్రులు అతను పనిమీద కేరళ వెళ్లి అక్కడే మరణించాడని బంధువులకు చెప్పారు.
అయితే ఈ మధ్యకాలంలో మణి బంధువు ఒకరు…మణి రెస్టారెంట్లో దిగి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సెల్ఫీని చూసి షాక్ తిన్నాడు. అతనితో పాటు నలుగురు బంధువులు కలిసి మణికోసం వెతగ్గా అతని ఆచూకీ బయటపడింది. బంధువులను చూసి మణి మొహం చాటేయగా వారు అతను మణే అని నిర్దారణకు వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిని అతను పనిచేస్తున్న తొండియర్ పేట్ నుండి అరియలూర్కి తరలించారు. ప్రస్తుతం మణి తిరుచునాపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. మొత్తానికి సెల్ఫీమీద మోజు…మణికి జైలు శిక్షని ప్రసాదించింది.