హత్యలు చేస్తున్నా...నన్ను ఆపండి!
అత్యంత భయానకమైన సినిమా కథలాంటి వాస్తవం ఇది. నా అన్నవారు, ఇల్లువాకిలీ లేని వినోద్ కుమార్ (40) అనే వ్యక్తి, సీరియల్ హత్యలు చేస్తూ…చివరికి ఢిల్లీ పోలీసులకు దొరికిపోయాడు. హత్యలు నేను చేయలేదు, ఆత్మలు చేయిస్తున్నాయి…హత్యలు చేయకుండా నన్ను ఆపండి…అంటూ పోలీసులను కోరాడు. ఢిల్లీలోని కల్యాణపురి ప్రాంతంలో వినోద్ కుమార్ బుధవారం ఒక ఘోరమైన హత్య చేశాడు. నిద్రపోతున్న రిక్షానడిపే వ్యక్తి తలమీద రాయితో మోది చంపేశాడు. తరువాత పారిపోకుండా అదే రిక్షాలో ఎక్కి కూర్చున్నాడు. అక్కడ […]
అత్యంత భయానకమైన సినిమా కథలాంటి వాస్తవం ఇది. నా అన్నవారు, ఇల్లువాకిలీ లేని వినోద్ కుమార్ (40) అనే వ్యక్తి, సీరియల్ హత్యలు చేస్తూ…చివరికి ఢిల్లీ పోలీసులకు దొరికిపోయాడు. హత్యలు నేను చేయలేదు, ఆత్మలు చేయిస్తున్నాయి…హత్యలు చేయకుండా నన్ను ఆపండి…అంటూ పోలీసులను కోరాడు. ఢిల్లీలోని కల్యాణపురి ప్రాంతంలో వినోద్ కుమార్ బుధవారం ఒక ఘోరమైన హత్య చేశాడు. నిద్రపోతున్న రిక్షానడిపే వ్యక్తి తలమీద రాయితో మోది చంపేశాడు. తరువాత పారిపోకుండా అదే రిక్షాలో ఎక్కి కూర్చున్నాడు. అక్కడ ఉన్న వారు సమాచారం ఇవ్వటంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తరువాత అతను చెప్పిన విషయాలు విని వారు నిర్ఘాంతపోయారు.
తాను అప్పటికి మూడు హత్యలు చేసినట్టుగా వినోద్ పోలీసులకు చెప్పాడు. ఉన్నావో, బెరేలీలలో ఇద్దరినీ, ఢిల్లీలో ఒకరిని చంపినట్టుగా చెప్పాడు. అయితే అతను మరిన్ని హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరాఖండ్కి చెందిన వినోద్ గత 20 ఏళ్లుగా ఢిల్లీలో ఉంటున్నాడు. వినోద్, తన తండ్రితో కలిసి ఉండేవాడు. అయితే కొన్నాళ్ల క్రితం తండ్రి మరణించడంతో ఒంటరిగా ఉంటున్నాడు. వారిద్దరికీ మానసిక వైకల్యం ఉందని వారు నివసించిన ప్రాంతాల్లోని స్థానికులు తెలిపారు. తాను ఆత్మల ప్రేరణతో హత్యలు చేస్తున్నానని, హత్యలు చేయకుండా తనని ఆపాలని వినోద్ పోలీసులను కోరాడు. రాత్రులు రోడ్ల పక్కన నిద్రపోయేవారిని తలపగుల గొట్టి చంపేసి, శవం పక్కనే రాత్రంతా కూర్చుని ఉండేవాడినని, తెల్లవారుతుండగా లేచి వెళ్లిపోయే వాడినని వినోద్ చెప్పాడు. శుక్రవారం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, అతను పూర్వం తిరిగిన ప్రదేశాలకు తీసుకువెళతామని, దాంతో అంతకుముందు చేసిన హత్యల వివరాలు సేకరించే అవకాశం ఉంటుందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.
వినోద్ తండ్రితో కలిసి జాతీయ రహదారి 24 ప్రాంతంలో ఉండేవాడినని చెప్పడంతో… అతడిని ప్రశ్నించడానికి ఉత్తర ప్రదేశ్ నుండి ఒక పోలీస్ బృందం కూడా ఢిల్లీకి వస్తున్నది. ప్రస్తుతం పోలీసులు వినోద్పై రిక్షా వ్యక్తిని హత్యచేసిన కేసుని నమోదు చేశారు.