భార్య మోసం...స్నేహితుని చంపిన భర్త!
ముంబయిలోని అంథేరీలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారం– తేజ్బహదూర్ మౌర్య, రాజేష్ సింగ్ స్నేహితులు. మౌర్య కూలీ కాగా, రాజేష్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ రోజు రాత్రి పదిగంటలకు మౌర్య తన ఇంటికి తిరిగి వస్తుండగా, ఇంటికి సమీపంలో రాజేష్ క్రీనీడలో ఒక మహిళతో మాట్లాడుతుండటం కనిపించింది. దగ్గరగా వెళ్లిచూసిన మౌర్యకు ఆమె తన భార్య అని అర్థమైంది. అప్పటివరకు అతనితో మాట్లాడుతున్న ఆమె, భర్తని చూడగానే, రాజేష్ తనపై అత్యాచార ప్రయత్నం […]
ముంబయిలోని అంథేరీలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారం– తేజ్బహదూర్ మౌర్య, రాజేష్ సింగ్ స్నేహితులు. మౌర్య కూలీ కాగా, రాజేష్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ రోజు రాత్రి పదిగంటలకు మౌర్య తన ఇంటికి తిరిగి వస్తుండగా, ఇంటికి సమీపంలో రాజేష్ క్రీనీడలో ఒక మహిళతో మాట్లాడుతుండటం కనిపించింది. దగ్గరగా వెళ్లిచూసిన మౌర్యకు ఆమె తన భార్య అని అర్థమైంది. అప్పటివరకు అతనితో మాట్లాడుతున్న ఆమె, భర్తని చూడగానే, రాజేష్ తనపై అత్యాచార ప్రయత్నం చేస్తున్నాడంటూ పెద్దగా కేకలు వేయసాగింది. స్నేహితుడు తనని మోసం చేస్తున్నాడనే కోపంతో ఊగిపోయిన మౌర్య, అంతవరకు ఆమె మామూలుగానే అతనితో మాట్లాడిందనే విషయాన్ని కూడా మర్చిపోయి, వేగంగా ఇంట్లోకి వెళ్లి కత్తిని తెచ్చి రాజేష్ని పొడిచాడు. మూడుసార్లు వరుసగా పొడవటంతో రాజెష్ మరణించాడు. తమకు అందిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. తదుపరి వారు జరిపిన విచారణలో రాజేష్ కి, మౌర్య భార్యతో ఎప్పటినుండో అక్రమ సంబంధం ఉందని తేలింది. పోలీసులు మౌర్యని అరెస్టు చేశారు.