11ఏళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!
ఉత్తర ప్రదేశ్ , ఆగ్రాలో ఇత్మద్–ఉద్-దౌలా ప్రాంతంలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. 11ఏళ్ల బాలికపై ఆమె మేనమామ సంతోష్ (40) అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఒంటరిగా ఇంట్లో నిద్రపోతుండగా చూసిన ఆ దుండగుడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. బాలిక పెనుగులాడగా, అతను ఆమెను మంచానికి కట్టేసి అఘాయిత్యం చేశాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పవద్దంటూ బాలికను బెదిరించాడు. కానీ అప్పటికే రక్త స్రావంతో బాధపడుతున్న చిన్నారి జరిగినదంతా తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులతో పాటు, […]
ఉత్తర ప్రదేశ్ , ఆగ్రాలో ఇత్మద్–ఉద్-దౌలా ప్రాంతంలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. 11ఏళ్ల బాలికపై ఆమె మేనమామ సంతోష్ (40) అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఒంటరిగా ఇంట్లో నిద్రపోతుండగా చూసిన ఆ దుండగుడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. బాలిక పెనుగులాడగా, అతను ఆమెను మంచానికి కట్టేసి అఘాయిత్యం చేశాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పవద్దంటూ బాలికను బెదిరించాడు. కానీ అప్పటికే రక్త స్రావంతో బాధపడుతున్న చిన్నారి జరిగినదంతా తల్లిదండ్రులకు చెప్పింది.
బాలిక తల్లిదండ్రులతో పాటు, చుట్టుపక్కలవారిని సైతం ఈ సంఘటన షాక్కి గురిచేసింది. వారంతా సంతోష్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికను ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తున్నారు. బాలిక పొత్తికడుపు భాగం తీవ్రంగా గాయపడినట్టుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉంది. బాలిక తండ్రి కూలిపని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.