ఓర్లాండో హంతకుడు...చివరి గంటల్లో, నిముషాల్లో ఏం చేశాడు!
ఓర్లాండో నైట్ క్లబ్లో మారణహోమం సృష్టించిన ఒమర్ మతీన్ దాడికి ముందు… చివరి గంటల్లో, నిముషాల్లో ఏం చేశాడు… అనేదానిమీద అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ పరిశోధించింది. దీనిపై అమెరికా సెనేట్ కమిటీ బుధవారం ఒక లేఖని విడుదల చేసింది. దీని ప్రకారం అతను ఆ సమయంలో వరుసగా ఫేస్బుక్ కి పోస్టింగులు చేశాడు. అలాగే కొన్ని విషయాలను సెర్చ్ చేసినట్టుగా తెలుస్తోంది. దాడికి ముందు అతను చేసిన ఫేస్బుక్ పోస్టింగ్లో అమెరికా రష్యాలు ఇస్లామిక్ స్టేట్మీద […]
ఓర్లాండో నైట్ క్లబ్లో మారణహోమం సృష్టించిన ఒమర్ మతీన్ దాడికి ముందు… చివరి గంటల్లో, నిముషాల్లో ఏం చేశాడు… అనేదానిమీద అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ పరిశోధించింది. దీనిపై అమెరికా సెనేట్ కమిటీ బుధవారం ఒక లేఖని విడుదల చేసింది. దీని ప్రకారం అతను ఆ సమయంలో వరుసగా ఫేస్బుక్ కి పోస్టింగులు చేశాడు. అలాగే కొన్ని విషయాలను సెర్చ్ చేసినట్టుగా తెలుస్తోంది. దాడికి ముందు అతను చేసిన ఫేస్బుక్ పోస్టింగ్లో అమెరికా రష్యాలు ఇస్లామిక్ స్టేట్మీద బాంబుదాడులను ఆపాలనే హెచ్చరిక ఉంది. చిన్నపిల్లలు, మహిళలు అన్యాయంగా మరణిస్తున్నారని పేర్కొన్నాడు. అసలైన ముస్లింలు పశ్చిమ దేశాల్లో సాగుతున్న అసహజ, అసంబద్ధ ధోరణులను ఎప్పటికీ ఆమోదించరన్నాడు. పల్స్ ఓర్లాండో గురించి, తుపాకీ షూటింగ్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేశాడు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ నాయకుడికి తన విధేయతని ప్రకటిస్తూ, అమెరికాలో రానున్న రోజుల్లో ఇస్లామిక్ స్టేట్ నుండి దాడులు ఉంటాయని హెచ్చరించాడు. అయితే మతీన్ చేసిన కిరాతకంలో ఇస్లామిక్ స్టేట్ ప్రమేయం ఉందనడానికి ఆధారాలు లేవని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. సెనేట్ కమిటీ ఈ లేఖని ఫేస్బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్కి పంపుతూ, మతీన్ నిర్వహించిన ఆన్లైన్ వ్యవహారాలకు సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా కోరింది.