ఇల్లంతా దోచారు... కొడుకునీ చంపేశారు!
దొంగలు ఇల్లంతా దోచుకుపోతున్నా కళ్లుమూసుకుని చనిపోయినట్టుగా నటించి ప్రాణాలు కాపాడుకున్నారు ఓ ఇద్దరు వయసు మళ్లిన బార్యాభర్తలు. న్యూఢిల్లీలో తెల్లవారితే గురువారమనగా అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది. దొంగలు తమ కుమారుని హత్యచేసినట్టుగా వారు తరువాత తెలుసుకున్నారు. ఒంటిగంట ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు దొంగలు రష్మీగుప్తా, ఆమె భర్త…ఇరువురి మీద మొదట దాడి చేశారు. రష్మీ గుప్తా చెబుతున్న వివరాల ప్రకారం….దొంగలను కిచెన్లో చూసిన వెంటనే వారు లాన్లో ఉన్న సర్వెంట్స్ రూములో నిద్రపోతున్న పనివాళ్లిద్దరినీ […]
దొంగలు ఇల్లంతా దోచుకుపోతున్నా కళ్లుమూసుకుని చనిపోయినట్టుగా నటించి ప్రాణాలు కాపాడుకున్నారు ఓ ఇద్దరు వయసు మళ్లిన బార్యాభర్తలు. న్యూఢిల్లీలో తెల్లవారితే గురువారమనగా అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది. దొంగలు తమ కుమారుని హత్యచేసినట్టుగా వారు తరువాత తెలుసుకున్నారు. ఒంటిగంట ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు దొంగలు రష్మీగుప్తా, ఆమె భర్త…ఇరువురి మీద మొదట దాడి చేశారు. రష్మీ గుప్తా చెబుతున్న వివరాల ప్రకారం….దొంగలను కిచెన్లో చూసిన వెంటనే వారు లాన్లో ఉన్న సర్వెంట్స్ రూములో నిద్రపోతున్న పనివాళ్లిద్దరినీ పెద్దగా కేకలు వేసి పిలిచారు. అయితే పనివాళ్లు స్పందించలేదు కానీ, దొంగలు లోపలికి వచ్చేశారు. వారు తమపై దాడికి దిగగానే మీకు కావలసింది తీసుకుపొండి… కానీ మమ్మల్ని ఏమీ చేయవద్దని భార్యాభర్తలు అర్థించారు. దొంగలు వారిని కొడుతూ క్లోరోఫామ్ని ఇద్దరికీ వాసన చూపించారు.
రష్మీ గుప్తా క్యాన్సర్ పేషంటు కావటం, ఎక్కువ మోతాదు మందులు వాడటం వలన ఆ ప్రభావం ఆమెకు తెలియలేదు. ఆమె భర్త మాత్రం కాస్త అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అయితే దొంగల నుండి ముప్పులేకుండా ఉండేందుకు వారిద్దరూ చనిపోయినట్టుగా నటిస్తూ అలాగే కదలకుండా ఉండిపోయారు. రష్మీ పోలీసులకు ఫోన్ చేయాలని ప్రయత్నించినా ఒక దొంగ మధ్యలో వచ్చి వారిద్దరినీ చెక్ చేస్తుండటంతో అది సాధ్యం కాలేదు. ముగ్గురు దొంగలు పై అంతస్తులో ఉన్న దంపతుల కొడుకు రోహన్ గుప్తా గదిలోకి వెళ్లారు. అతను ఎదురు తిరగటంతో, అతని కాళ్లు చేతులు కట్టేసి, తీవ్రంగా గాయపరచారు. అనంతరం డబ్బు, నగలు దోచుకున్నారు.
గంట తరువాత వారు బయటకు వెళ్లారని నిర్దారించుకున్నాక రష్మీ పనివాళ్లకోసం, కొడుకుకోసం కేకలు వేసింది. పనివాళ్లు వచ్చి చూసే సరికి రోహన్ గుప్తా కొనఊపిరితో ఉన్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కూలర్ని పెట్టుకుని నిద్రపోవటం వలన తమకు తమ యజమానులు వేసిన కేకలు వినిపించలేదని పనివాళ్లు తెలిపారు. రోహన్ గుప్తా ఓ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. దొంగలు బయటకు వెళుతున్నపుడు చూసిన పక్కింటివాళ్లు కాల్ చేయటంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… కేసుని నమోదు చేసుకుని, ఆధారాలు వివరాలు సేకరిస్తున్నారు.